Sky OV: సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే విమానాలు నిజంగా రాబోతున్నాయట!
డిజైనర్ ఆస్కార్ వినల్స్ సరికొత్త విమానాల (Supersonic Plane) రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. వాటి వేగం, రూపం, సామర్థ్యం అసాధారణంగా ఉండబోతోందని ఆయన ప్రకటించారు.
Image: oscarvinals11
ఇంటర్నెట్ డెస్క్: విమానం (Supersonic Plane).. ఈ పేరు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ సుపరిచితమే. పల్లె, పట్టణం అనే తేడా అది గాల్లో ప్రయాణిస్తూ ఎప్పుడో ఒకసారి వారి కంటపడే ఉంటుంది. అలా కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న విమానాల ఆకృతి, వేగం త్వరలో మారనుందట. అవి చూడటానికి అచ్చంగా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చక్కర్లు కొట్టే విమానాలను పోలి ఉంటాయని బార్సిలోనాకు చెందిన డిజైనర్ ఆస్కార్ వినల్స్ చెబుతున్నారు. ‘స్కై ఓవీ’ అని వాటికి పేరు పెట్టానని.. వాటితో విమానయాన రంగంలో ఓ విప్లవం రాబోతోందని ఆయన చెప్పారు.
ఈ కొత్త తరహా విమానాలు ఎలా ఉంటాయో తెలిపేందుకు వినల్స్ కొన్ని ఊహాజనిత చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ‘రాబోయే తరం వాణిజ్య విమానాలు ప్రస్తుతం ఉన్న వాటి కంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి. వాటి ఫ్యూజ్లేజెస్, ఇంజిన్లు, ఇంధన మూలాలు, ఇతర వైమానిక వ్యవస్థలన్ని ఇవాళ మనం చూస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలు నిజమైతే ఎలా ఉంటాయో అచ్చం అలాగే ఉంటాయని’ వ్యాఖ్యానిస్తూ కొన్ని చిత్రాలను పంచుకున్నారు.
క్రిమియాలోని షిప్యార్డ్పై ఉక్రెయిన్ దాడి.. ఓ అత్యాధునిక నౌక ధ్వంసం..!
ఆస్కార్ వినల్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ తరహా విమానాలను బ్లేడ్లెస్ టర్బోజెట్ ఇంజిన్లతో రూపొందిస్తున్నారు. వాటిలో కూర్చొని 300 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. సరకులను తీసుకెళ్లవచ్చు. ప్రతి సీటు వద్ద, విమానం అంతటా కొన్ని లగ్జరీ డివైజ్లను అమర్చనున్నారు. ఇక ‘స్కై ఓవీ’ టాప్ స్పీడ్ మాక్ 1.5. అంటే గంటకు 1150 మైళ్లు అవలీలగా ప్రయాణిస్తుంది. అతి తక్కువ హైడ్రోజన్ ఇంధనాన్ని వినియోగించుకొని సుదీర్ఘ దూరాలను చేరుకుంటుంది. వీటి కారణంగా ఎలాంటి కర్బన ఉద్గారాలు కూడా వెలువడవు. ఈ విమానాలను ఎయిర్పోర్టులో పార్క్ చేసిన తరువాత దాని రెక్కలను మూసుకుపోయేలా కూడా చేయొచ్చు. అందువల్ల తదుపరి ప్రయాణం ప్రారంభించేంత వరకు విమానాశ్రయంలోని స్థలాన్ని ఆదా చేసుకోవచ్చు.
ఈ భవిష్యత్ విమానాల ఇంజిన్లు చాలా తేలికగా ఉంటాయని వినల్ కంపెనీ వెబ్సైట్ పేర్కొంది. నిశ్శబ్దంగా కదులుతూనే అవి మరింత సమర్థవంతంగా ప్రయాణిస్తాయని తెలిపింది. ‘ప్రస్తుతం ఉన్న విమాన ప్రయాణాల కంటే వీటిలో ప్రయాణం చాలా భిన్నంగా ఉంటుంది. విశాలమైన స్థలం, ప్రత్యేకమైన వస్తువులు, లగ్జరీ వసతులు.. తదితర సౌకర్యాలుంటాయి. మా విమానాల డిజైన్పై కొనసాగుతున్న పరిశోధనను వినియోగించి కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడంపై దృష్టి సారించాం. దాంతో భవిష్యత్తులో అద్భుతమైన విమాన ఆవిష్కరణలు సృష్టిస్తామని’ వెల్లడించింది.
గతంలో ఇదే డిజైనర్ కంపెనీ ఓ ‘ఊహాజనిత విమానం’ గురించి ప్రకటించింది. అందులో కూర్చొని న్యూయార్క్ నుంచి లండన్కు కేవలం 80 నిమిషాల్లోనే ప్రయాణం పూర్తి చేయొచ్చని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దానికి ‘హైపర్ స్టింగ్’ అని పేరు పెట్టింది. ఆ విమానం ప్రపంచంలోనే చివరి వాణిజ్య సూపర్సోనిక్ జెట్ ‘కాంకోర్డ్’ కంటే రెండు రెట్లు పెద్దగా ఉండి, రెండు రెట్లు వేగంగా ప్రయాణిస్తుందని చెప్పి సంచలనం సృష్టించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
చాబహార్ పోర్టు డీల్పై అమెరికా చేసిన హెచ్చరికలకు భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని వెల్లడించింది. -
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బే: కేఎల్ రాహుల్
-
మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్పై హత్యాయత్నం
-
తెలంగాణలో రెండు వారాలు సినిమా ప్రదర్శనలు నిలిపివేత!
-
గో డిజిట్ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే..
-
హార్దిక్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్.. వారిద్దరు ఐపీఎల్లో ఏం సాధించారు?: గంభీర్
-
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్