Justin Trudeau: నాజీలపై ట్రూడో ప్రేమ.. భగ్గుమన్న కెనడా రాజకీయ వర్గాలు..!
కెనడాలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం చేపట్టిన ఓ చర్య కలకలం సృష్టించింది. నాజీ మాజీ సైనికుడిని పార్లమెంట్ సాక్షిగా విదేశీ అతిథి సమక్షంలో గౌరవించింది. అతడి గతం తెలుసుకోకుండా ఏకంగా చట్టసభకు పిలిపించడం.. గౌరవించడం జరిగిపోయాయి. చివరికి విషయం తెలిసి బహిరంగ క్షమాపణలు కోరింది.
ఇంటర్నెట్డెస్క్: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సారి ఏకంగా హిట్లర్తో కలిసి పోరాడిన నాజీ డివిజన్ సైనికుడిని పార్లమెంట్ సాక్షిగా గౌరవించి కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ ఆంటోని రోటా ఆ తర్వాత తీరిగ్గా యూదులకు క్షమాపణలు చెప్పారు. మరో వైపు ప్రతిపక్ష పార్టీలు ట్రూడో వ్యవహారశైలిపై మండిపడుతున్నాయి.
రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల తొలిసారి కెనడాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం పార్లమెంట్కు వచ్చారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ఆంటోనీ రోటా ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్ హంకాను ఆహ్వానించారు. పార్లమెంట్లో జెలెన్స్కీ ప్రసంగం అనంతరం స్పీకర్ రోటా స్వయంగా హంకాను పరిచయం చేస్తూ.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడిగా కీర్తించారు. దీంతో అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీ సహా అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు. అతడికి జెలెన్స్కీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. ఆ తర్వాతే అసలు వివాదం మొదలైంది.
కెనడాలోని ‘ది ఫ్రెండ్స్ ఆఫ్ సైమన్ వెసింతల్ సెంటర్’ ప్రతినిధులు పార్లమెంట్ చర్యను ఖండించారు. పార్లమెంట్ గౌరవించిన హంకా రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పక్షాన పోరాడిన ‘14వ వాఫన్ గ్రనేడియర్ డివిజన్’కు చెందిన వ్యక్తి అని వెల్లడించారు. ఈ డివిజన్ చేతులు యూదుల రక్తంతో తడిశాయని పేర్కొన్నారు. న్యూరేమ్బర్గ్ విచారణలో ఈ డివిజన్ను నేరగాళ్ల బృందంగా ప్రకటించారని తెలిపారు.
ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. దీంతో హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ ఆంటోని రోటా ఆదివారం క్షమాపణలు చెప్పారు. ‘‘అతడి గురించి నాకు పూర్తిగా తెలియదు. తెలిసిన తర్వాత నా నిర్ణయానికి పశ్చాత్తాపం చెందాను. నా తోటి పార్లమెంట్ సభ్యులకుగానీ, ప్రధానికిగానీ, ఉక్రెయిన్ బృందానికి గానీ దీనితో సంబంధం లేదు. అతడిని ఆహ్వానించడం పూర్తిగా నా పనే’’ అని వివరణ ఇచ్చుకొన్నారు. మరో వైపు ప్రధాని జస్టిన్ ట్రూడో ఆఫీస్ కూడా దీనిపై స్పందించింది. జరిగిన పొరపాటుకు స్పీకర్ క్షమాపణలు చెప్పారని పేర్కొంది. అతడి ఆహ్వానం విషయం తమకు ముందుగా తెలియదని వివరణ ఇచ్చింది.
పుడమిని చేరింది.. ఏం చెప్పనుంది?
హిట్లర్ వద్ద పనిచేసిన క్రూరమైన సైనిక బృందాల్లో ‘14వ వాఫన్ గ్రనేడియర్ డివిజన్’ కూడా ఒకటి. జర్మనీ సోవియట్పై దాడి చేసిన సమయంలో.. ఉక్రెయిన్లోని కొందరు వాలంటీర్లు వారికి సాయపడ్డారు. వారితో ఏర్పాటు చేసిందే ఈ డివిజన్. సోవియట్ నుంచి ఉక్రెయిన్ విడిపోవడం కోసం వారు ఇలా చేశారు. ఆ తర్వాత ఈ బృందం హిట్లర్ తరపున పలు దాడుల్లో పాల్గొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ బృందంలోని కొందరు సభ్యులు కెనడా వచ్చి స్థిరపడ్డారు. వారిలో ఒకరు యారోస్లోవ్ హంకా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మకు మందులు తెచ్చేందుకు వెళ్లి అనంతలోకాలకు..
-
కదిలొచ్చిన ఓటు.. కలిసొచ్చేది ఎటు!
-
బిర్యానీ బిల్లు ఎక్కువైందంటూ జవాన్ల వీరంగం
-
కాయ్ రాజా కాయ్!.. కూటమిదే అధికారమని జోరుగా పందేలు
-
నాడు ఫిఫోతోనే చెల్లింపులు.. ఇప్పుడెందుకు లేవు?
-
నాందేడ్-విశాఖ ఎక్స్ప్రెస్కు గ్రీన్ఛానల్.. ఓటర్ల కోసం దూసుకెళ్లిన రైలుబండి