Ukraines Special Operation: టార్గెట్ సెవెస్తపోల్.. ఉక్రెయిన్ దాడిలో దెబ్బతిన్న సబ్మెరైన్..!
రష్యాకు చెందిన నల్ల సముద్ర దళాన్ని ఇప్పుడు ఉక్రెయిన్ మెల్లిగా కకావికలం చేస్తోంది. గతేడాది మాస్కోవా మునకతో భారీగా దెబ్బతిన్న ఈ దళానికి గత వారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. కిలోశ్రేణి సబ్మెరైన్పై ఉక్రెయిన్ క్షిపణి దాడి చేసి తీవ్రంగా దెబ్బతీసింది.
ఇంటర్నెట్డెస్క్: రష్యా(Russia)కు నల్లసముద్రంపై తిరుగులేని ఆధిపత్యం అందించిన సెవెస్తపోల్ నౌకాశ్రయం ఇప్పుడు ఉక్రెయిన్ (Ukrain) దాడులకు లక్ష్యంగా మారింది. ఇటీవల దాడిలో రష్యాకు చెందిన నౌకలు దెబ్బతిన్నాయి. దీంతోపాటు కిలోక్లాస్ సబ్మెరైన్ కూడా క్షిపణి దాడిలో దెబ్బతిన్నట్లు బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాలు రెండ్రోజుల క్రితం ధ్రువీకరించాయి. ఇది రష్యాకు భారీ ఎదురుదెబ్బ. ఇటీవల రష్యాపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే.
సెప్టెంబర్ 13న ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణులు సెవెస్తపోల్లోని సెవ్మోర్జవోడ్ షిప్యార్డ్పై విరుచుకుపడ్డాయి. అక్కడే ఉన్న ల్యాండిషిప్ మిన్స్క్ ఈ దాడిలో దెబ్బతింది. దీంతోపాటు నిర్వహణ పనుల నిమిత్తం అక్కడే నిలిపి ఉంచిన కిలో 636.3 శ్రేణికి చెందిన ‘రోస్తోవ్ ఆన్ డాన్’ సబ్మెరైన్ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇటీవల ప్రపంచంలో శత్రు దాడుల్లో దెబ్బతిన్న జలాంతర్గామి ఇదే. రష్యాకు చెందిన బ్లాక్సీ దళంలోని నాలుగు క్రూయిజ్ మిసైల్ సబ్మెరైన్లలో ఇది కూడా ఒకటి. ఒక్కో జలాంతర్గామి 3 లేదా 4 కిలిబ్ర్ క్షిపణులను ప్రయోగించగలదు.
ఈ దాడి గురించి బయటకు వెల్లడిస్తే పరువు పోతుందని రష్యా భావించింది. దీంతో కేవలం రెండు నౌకలు దెబ్బతిన్నాయని ముక్తసరి ప్రకటనతో సరిపుచ్చింది. ఈ దాడిలో దెబ్బతిన్న జలాంతర్గామి తిరిగి సర్వీసులోకి రావాలంటే కొన్నేళ్లపాటు మరమ్మతులు చేయాలి. అదే సమయంలో రష్యాకు మిలియన్ల మేర డాలర్లు వదులుతాయి.
ఒకరి జీవితాన్ని మరొకరు వెల కట్టలేరు
అంతేకాదు.. ఈ డ్రై డాక్లో చిక్కుకుపోయిన నౌక, సబ్మెరైన్ శకలాలను తొలగించాలన్నా రష్యాకు భారీగా ఖర్చు కానుంది. ఫలితంగా ఈ డ్రై డాక్లు కొన్ని నెలలపాటు యుద్ధ సమయంలో మూతపడనున్నాయి. యుద్ధం ఆరంభం నుంచి ఈ నౌకాదళ స్థావరంపై ఉక్రెయిన్ కన్నేసింది. ఈ స్థావరంపై దాడికి తన స్టార్ లింక్ సహకరించదని మస్క్ గతేడాది ఉక్రెయిన్కు వెల్లడించారు. ఇది అణుదాడికి దారి తీస్తుందని ఆయన భయపడిన విషయం తెలిసిందే. కానీ, ఉక్రెయిన్ మాత్రం పట్టువీడలేదు. ఇక్కడ మాస్కోవాను ముంచి వేయడంతోపాటు.. పలు మార్లు సముద్ర డ్రోన్లను ప్రయోగించి రష్యా నౌకలను దెబ్బతీసింది. ఆగస్టు 20న ఇక్కడ నేవీ హెడ్క్వార్టర్స్పై ఏకంగా డ్రోన్తో దాడి చేసింది.
సోవియట్-రష్యా చరిత్రలో కిలో శ్రేణి సబ్మెరైన్లకు ప్రత్యేక స్థానం..
కోల్డ్వార్ సమయంలో సోవియట్ యూనియన్ అభివృద్ధి చేసిన చివరి డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన ఇదే. సోవియట్ పతనం తర్వాత రష్యా చేతికి దక్కింది. మాస్కో అత్యధికంగా ఎగుమతి చేసింది కిలోశ్రేణి సబ్మెరైన్లే. వీటిల్లో భారత్ కూడా దాదాపు 10 కిలో 877 శ్రేణి జలాంతర్గాములను కొన్నది. వీటిల్లో 8 ఇప్పటికీ సర్వీసులో ఉన్నాయి. రష్యా, అల్జీరియా, చైనా, భారత్, మయన్మార్, పోలాండ్, ఇరాన్, రొమేనియా, వియత్నాం దేశాలు వీటిని ఇప్పటికీ వాడుతున్నాయి. వీటిల్లో అత్యాధునిక వెర్షన్ కిలో 636.3. కోల్డ్వార్ సమయంలో ఈ కిలో శ్రేణి సబ్మెరైన్ల స్టెల్త్ సామర్థ్యాల కారణంగా దీనిని ప్రత్యర్థులు ‘బ్లాక్ హోల్’ అని పిలిచేవారు. దీనిలో చాలా తక్కువ శబ్దం రావడంతో ఈ పేరు వచ్చింది.
ఆదివారం కూడా సెవెస్తపోల్పై దాడి..
కీవ్ ప్రత్యేక దళాలు తాజాగా ఆదివారం నిర్వహించిన ఆపరేషన్తో సెవెస్తపోల్ దద్దరిల్లిపోయింది. ఇది తమ దళాల పనే అని ఉక్రెయిన్ చెబుతోంది. కానీ, రష్యా నియమించిన క్రిమియా గవర్నర్ మాత్రం.. తమ నౌకాదళం వినియోగించిన మందుగుండు కారణంగా జరిగిన పేలుళ్లని చెబుతున్నారు. సెవెస్తపోల్ దక్షిణ తీరంలో భారీగా పేలుళ్లు జరిగాయి. దీంతోపాటు దట్టమైన పొగ వ్యాపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
Ukraine-Russia Conflict: ఉక్రెయిన్పై యుద్ధంలో పైచేయి సాధించడం కోసం రష్యా రసాయన ఆయుధాలు వాడుతోందని అమెరికా ఆరోపించింది. -
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్