US: యెమెన్పై కొనసాగుతున్న క్షిపణుల దాడులు.. నౌకలు రావొద్దని అమెరికా హెచ్చరిక
Houthi-US: హౌతీ రెబల్స్ను లక్ష్యంగా చేసుకొని అమెరికా చేపట్టిన ప్రతీకార దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. శనివారం కూడా యెమెన్లోని హౌతీల కేంద్రంపై అగ్రరాజ్యం క్షిపణులు కురిపించింది.
క్షిపణి దాడిలో ధ్వంసమైన సనా ఎయిర్పోర్టులోని హౌతీల రాడార్ కేంద్రం
వాషింగ్టన్: ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలతో అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఎర్ర సముద్రం (Red Sea)లో వాణిజ్య నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న హౌతీ (Houthi) రెబల్స్పై అమెరికా (USA) ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. యెమెన్ (Yemen)లోని హౌతీల కేంద్రంపై అమెరికా శనివారం మరోసారి క్షిపణులతో దాడులు చేసింది. రాజధాని సనాలో భారీ పేలుడు శబ్దం వినిపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్లోని యెమెన్ తీర ప్రాంతాల వైపు రావొద్దని అమెరికా జెండాలతో ఉన్న వాణిజ్య నౌకలను యూఎస్ నేవీ శుక్రవారం రాత్రి హెచ్చరించింది. మరో 72 గంటల పాటు ఆ మార్గంలో వెళ్లొద్దని సూచించింది. ఆ కొద్ది గంటలకే యెమెన్లోని హౌతీ కేంద్రంపై క్షిపణి దాడి జరిగింది. ఈ తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. ‘‘హౌతీలు మరిన్ని భీకర దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తుంటే.. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే తగ్గేలా కన్పించట్లేదు.
యెమెన్పై అమెరికా, బ్రిటన్ క్షిపణుల వర్షం
శుక్రవారం తెల్లవారుజామున యెమెన్లోని పలు ప్రాంతాలపై అమెరికా, బ్రిటన్ సైన్యాలు ప్రతీకార దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సాయుధ ముఠాకు సంబంధించిన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణుల వర్షం కురిపించాయి. రాజధాని సనా సహా 28 ప్రాంతాల్లో 70కి పైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఈ ఉద్రిక్తతలు ఆందోళనలకు దారితీశాయి. అమెరికా, యూకే దాడులను వ్యతిరేకిస్తూ సనా ప్రాంతంలో హౌతీ మద్దతుదారులు నిరసన చేపట్టారు.
అయితే, ఈ దాడులకు అమెరికా, బ్రిటన్ మూల్యం చెల్లించుకోక తప్పదని హౌతీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్కు సంబంధించిన నౌకలపై దాడులు ఏమాత్రం ఆగబోవని హౌతీ మంత్రి హుస్సేన్ అల్ ఎజ్జి ప్రకటించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఎర్ర సముద్రంలోని ఓ నౌకపై హౌతీ రెబల్స్ క్షిపణి దాడి చేశారు. అది గురితప్పి వాణిజ్య నౌకకు 500 మీటర్ల దూరంలో పడినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.