USA: 908 రోజుల తర్వాత భూమిపైకొచ్చిన అమెరికా అంతరిక్ష డ్రోన్..!
అమెరికా ప్రయోగించిన ‘ది ఎక్స్-37బీ ఆర్బిటల్ టెస్ట్ వెహికల్’ ఎట్టకేలకు 908 రోజుల తర్వాత ఫ్లోరిడాలో నాసాకు చెందిన కెన్నెడి స్పేస్ సెంటర్లో ల్యాండ్ అయింది.
ఇంటర్నెట్డెస్క్: అమెరికా ప్రయోగించిన ‘ది ఎక్స్-37బీ ఆర్బిటల్ టెస్ట్ వెహికల్’ ఎట్టకేలకు 908 రోజుల తర్వాత ఫ్లోరిడాలో నాసాకు చెందిన కెన్నెడి స్పేస్ సెంటర్లో ల్యాండ్ అయింది. అమెరికాకు చెందిన స్పేస్ ఫోర్స్ రహస్య వాహనాన్ని 2020 మే నెలలో ప్రయోగించింది. ఈ స్పేస్ వెహికల్ను బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసింది. గతంలో కక్ష్యలో గడిపిన 780 రోజుల రికార్డును ఈ సారి బద్దలు కొట్టినట్లు బోయింగ్ పేర్కొంది. ఈ యాత్రకు సంబంధించిన కీలక విషయాలను స్పేస్ ఫోర్స్ బహిర్గతం చేయలేదు. ఈ సారి దీనిలో పేలోడ్ సంఖ్యను పెంచేలా సర్వీస్ మాడ్యూల్ను కూడా తీసుకెళ్లింది.
అంతరిక్షంలో ఆర్బిటల్ టెస్ట్ వెహికల్ నుంచి ఈ మాడ్యూల్ విడిపోయి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో అమెరికా నేవల్ రీసెర్చి పరిశోధనశాలకు అవసరమైన ప్రయోగాలు చేశారు. దీంతోపాటు థర్మల్ కంట్రోల్ కోటింగ్స్, ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్, రేడియేషన్ షీల్డింగ్ మెటీరియల్ వంటి వాటితో అంతరిక్షంలో పదార్థాల, సాంకేతికత పనితీరుపై పరీక్షలు చేశారు. ఎక్స్-37బీకి ఆరో అంతరిక్ష యాత్ర. తన ప్రయాణంలో మొత్తం 1.3 బిలియన్ మైళ్ల దూరం ఇది ప్రయాణించింది. మొత్తం 3,774 రోజులు అంతరిక్షంలో గడిపింది. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలకు అవసరమైన పలు ప్రయోగాలను అంతరిక్షంలో నిర్వహించి వాటిని విశ్లేషణ నిమిత్తం తిరిగి భూమిపైకి సురక్షితంగా చేరుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!