Trump-Vivek: వివేక్.. ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండరు..!
ఇన్నిరోజులు రిపబ్లికన్ పార్టీ నేతలు ట్రంప్(Trump), వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) మధ్య సానుకూల వాతావరణం కనిపించగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. వివేక్కు వ్యతిరేకంగా ట్రంప్ వైపు నుంచి వ్యాఖ్యలు వినిపించడమే అందుకు కారణం.
వాషింగ్టన్: అమెరికా (USA) అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరపున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ట్రంప్ వర్గం నుంచి వివేక్కు మరో ప్రతికూల ప్రకటన వచ్చింది. ట్రంప్నకు ఆయన ఉపాధ్యక్ష సహచరుడిగా ఉండరని తెలిపింది. ఈ మేరకు మాజీ అధ్యక్షుడి దగ్గరి అనుచరుడిని ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
రిపబ్లికన్పార్టీలో ట్రంప్నకే భారీ మద్దతు లభిస్తోంది. ఆయనతో పోటీ పడటానికి రామస్వామి(Vivek Ramaswamy) యత్నిస్తున్నారు. పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతోన్న ఆయన.. ఉపాధ్యక్ష అభ్యర్థిత్వాన్ని స్వీకరించడానికి సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘నాకు పదవి ముఖ్యం కాదు. ఇంత చిన్న వయసులో అది కూడా మంచి పదవే. శ్వేతసౌధంలో ట్రంప్ నా మార్గదర్శకులుగా, సలహాదారుగా ఉంటే సంతోషిస్తా’ అని వివేక్ గతంలో అన్నారు. అప్పుడు దానిపై ట్రంప్ నుంచి కూడా సానుకూల స్పందనే వచ్చింది. మీరు ఆయన్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా పరిగణించారా? అని ప్రశ్నించగా..‘ఆయన చాలా తెలివైన వ్యక్తి. ఆయన తగిన వ్యక్తి అని భావిస్తున్నా’ అని బదులిచ్చారు. కానీ ఇప్పుడు ట్రంప్ వర్గం నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. ‘ఓటర్లు వివేక్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకోకపోవచ్చు. ఆయన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండరు’ అని వెల్లడించింది.
తన మద్దతుదారులు రామస్వామి(Vivek Ramaswamy)కి ఓటువేయొద్దని, ఆయనొక అవినీతి పరుడు, ఆర్థిక నేరగాడని ట్రంప్ ఆరోపించారు. మోసపూరిత ప్రచారాలతో తన అనుచరుల మద్దతు కూడగట్టేందుకు ప్రయ్నతిస్తున్నాడని విమర్శించారు. ఈ తరుణంలోనే మాజీ అధ్యక్షుడి సన్నిహితుడు నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
త్వరలో బైడెన్ సర్కారుకు జాన్ కెర్రీ గుడ్బై!
ఇదిలా ఉంటే.. రిపబ్లికన్పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతోన్న ఏకైక మహిళ నిక్కీ హేలీ మాట్లాడుతూ.. ఉపాధ్యక్షురాలిగా ఉండటంపై తనకు ఆసక్తి లేదని అన్నారు. తదుపరి అమెరికా ప్రెసిడెంట్గా ఉండేందుకు, గెలిచేందుకు పోటీ పడుతున్నానని వెల్లడించారు. రెండు పార్టీలు తమ అధ్యక్ష అభ్యర్థులను ఎన్నుకునే సుదీర్ఘ ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో నేతల స్పందనలు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.