KCR: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది భారాస ప్రభుత్వమే: కేసీఆర్‌

శనివారం నాగర్‌కర్నూల్‌లో పర్యటించిన భారాస అధినేత కేసీఆర్‌ రాష్ట్రంలో మళ్లీ భారాస (BRS) ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు.

Published : 28 Apr 2024 10:25 IST

తెలంగాణలో మళ్లీ భారాస (BRS) ప్రభుత్వమే వస్తుందని, అందులో ఏ అనుమానం లేదని, ప్రజలు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా జనం కాంగ్రెస్ ప్రభుత్వంపై భగ్గుమంటున్నారని, సర్కారుకు చురక పెట్టాలనే ఆలోచన ప్రజల్లో వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారాస ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని చెప్పారు. బస్సుయాత్రలో భాగంగా శనివారం నాగర్‌కర్నూల్‌లో పర్యటించిన కేసీఆర్‌ రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలోని మోదీ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు