WI vs IND: భారత్‌కు మరో షాక్‌.. ఉత్కంఠపోరులో వెస్టిండీస్‌దే విజయం..

 విండీస్‌తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌కు వరుసగా రెండో ఓటమి. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో టీమ్‌ఇండియాపై విండీస్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  టీమ్‌ఇండియా నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Updated : 07 Aug 2023 00:04 IST