Chahal: జట్టు కూర్పే కీలకం.. ఇది చెస్ కాదు: యుజ్వేంద్ర చాహల్
‘కుల్చా’ ద్వయం.. కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ (Chahal). భారత స్పిన్ ద్వయం ఇటీవల కాలంలో ఒకరు ఆడితే.. మరొకరు రిజర్వ్ బెంచ్కే పరిమితం కావాల్సి వస్తోంది. ఇదే విషయంపై విండీస్తో రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా చాహల్ను విలేకర్లు ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్లో మణికట్టు మాంత్రికుడిగా పేరొందిన యుజ్వేంద్ర చాహల్కు (Chahal) ఇటీవల అవకాశాలు మాత్రం తక్కువగా వస్తున్నాయి. టీమ్ఇండియాతోపాటు (Team India) ప్రయాణిస్తున్నప్పటికీ తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. వివిధ సమీకరణాల కారణంగా రిజర్వ్ బెంచ్కే పరిమితమవుతూ వస్తున్నాడు. తాజాగా విండీస్తో వన్డే సిరీస్లోనూ (WI vs IND) ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. అయితే, టీ20 సిరీస్లోని తొలి మ్యాచ్లో ఆడే అవకాశం లభించింది. మూడు ఓవర్లు వేసి కీలకమైన ఓపెనర్ల వికెట్లను పడగొట్టిన చాహల్ తన సత్తా చాటాడు. ఇవాళ విండీస్తో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో చాహల్ ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. క్రికెట్ అంటేనే జట్టుగా ఆడాల్సి ఉంటుందని, చెస్ మాదిరిగా ఒకరే ఆడరని పేర్కొన్నాడు.
‘‘జట్టు కూర్పు మా తొలి ప్రాధాన్యం. ఇందులో కొత్తేమీ లేదు. లోయర్ ఆర్డర్లో ఏడో స్థానంలో రవీంద్ర జడేజా లేదా అక్షర్ పటేల్ వస్తారు. ఒకవేళ జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండాలంటే పిచ్ పరిస్థితి అందుకు తగ్గట్టుగానే ఉండాలి. కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. దీంతో అతడికి అవకాశాలు ఇస్తూ టీమ్ఇండియా మద్దతుగా నిలిచింది. ఇక నేను ఎప్పుడు అవకాశం వచ్చినా నా సత్తా ఏంటో చూపించడానికి ప్రయత్నిస్తుంటా. అంతేకానీ, ఖాళీగా మాత్రం ఉండను. నా ప్రాక్టీస్ నేను చేస్తుంటా.
ఈ నాలుగే సెమీస్కు.. టీమ్ఇండియాలో ఆ సీనియర్ ఉండాల్సిందే
మేము ప్రొఫెషనల్ ఆటగాళ్లం. దాదాపు రెండునెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా. మొన్న ఐపీఎల్లో ఆడా. అదంతా నా సన్నద్ధతకు బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఇదేమీ వ్యక్తిగతంగా ఆడే క్రీడ కాదు. జట్టు కోసం ఆడేందుకే ఇక్కడ ఉన్నాం. ఎవరైనా ఆటగాడు ఓ రెండు సిరీస్లకు ఎంపికై పక్కన కూర్చుంటే.. అతడు జట్టు నుంచి దూరం అయినట్లు కాదు. నేను మాత్రం సంతోషంగా ఉన్నా. నేనేమీ ఇంటి దగ్గర కూర్చోవడం లేదు. జట్టుతోపాటే ప్రయాణిస్తున్నా. జట్టులోనే భాగమై ఉంటున్నా. నేను చదరంగం ఆడాను. కానీ, అది వ్యక్తిగత గేమ్. క్రికెట్ మాత్రం జట్టుగా ఆడే ఆట. జట్టులోని 15 మందిలో 11 మంది మాత్రమే బరిలోకి దిగుతారు. నేను ఆడినప్పుడు కుల్దీప్కు అవకాశం దక్కలేదు. ఇప్పుడు అతడు ఆడుతున్నాడు. తుది జట్టులో లేకుండా రిజర్వ్ బెంచ్పై ఉన్నప్పటికీ భారత జెర్సీ వేసుకునే ఉంటాను కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నా. నలుగురి కెప్టెన్సీలో ఆడటం ఆనందంగా ఉంది. మేమంతా ఒకే కుటుంబం ఉంటాం. అందులో ధోనీ పెద్దన్న కాగా.. తర్వాత విరాట్, రోహిత్ వచ్చారు. ఇప్పుడు హార్దిక్ నాయకత్వంలో ఆడుతున్నా’’ అని చాహల్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. జట్టు సభ్యుల ఎంపికపై వస్తోన్న విమర్శలు, సందేహాలపై వివరణ ఇచ్చారు. -
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
ధోనీని రనౌట్ చేసిన వికెట్ కీపర్ జితేశ్ శర్మపై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. అతడి ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు. -
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట తీరుపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా స్ట్రైక్రేట్ ఉండటం లేదని కొందరు మాజీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాటిపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. -
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్