Andhra news: 13 జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు
పాలనకు సాంకేతికత జోడింపు
డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర ఆర్టీజీఎస్ కేంద్రం నమూనా
మొంథా తుపాను ప్రభావాన్ని ముందుగా అంచనా వేసి.. ప్రజలను అప్రమత్తం చేయడంలో రియల్టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సాంకేతికత కీలకంగా మారింది. భారీ విపత్తులోనూ ప్రాణనష్టం నివారించడం సాధ్యమైంది. సీఎం చంద్రబాబు సహా ఉన్నతాధికారులు, మంత్రులు ఆర్టీజీఎస్ సాంకేతికత ఆధారంగా ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఈనాడు, అమరావతి: ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఒకే నమూనాలో పనిచేసే 13 ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. రాజధానిలోని ప్రధాన కేంద్రానికి వాటిని అనుసంధానం చేయనుంది. వాటి ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పించి, అన్ని ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని అక్కడి ఆర్టీజీఎస్ కేంద్రాలకు అనుసంధానం చేయనుంది. జిల్లాల్లో నిర్మించే కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించనుంది.
రాజధానిలో ఆధునిక హంగులతో కేంద్రం
రాష్ట్ర ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం సచివాలయం దగ్గర మల్టీపర్పస్ భవనాన్ని నిర్మిస్తోంది. ఆర్టీజీఎస్ సేవలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 750 సేవలను అందిస్తోంది. అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా ఇస్రో సహకారంతో శాటిలైట్ సాయంతో వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వశాఖల సమాచారం ఒకేచోట ఉండేలా డేటా లేక్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యకలాపాలకు ఆర్టీజీఎస్ కేంద్రం అవుతుంది.
రాష్ట్రస్థాయి భవనాల్లో ప్రత్యేకతలు ఇవీ
- రాష్ట్రస్థాయి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
 - 264 మంది ఆపరేటర్లు పనిచేసేలా వర్క్స్టేషన్ టేబుళ్లు
 - 338 మందితో సమావేశం నిర్వహించేలా పెద్ద సమావేశ మందిరం
 - 14 మందితో సమావేశమయ్యేందుకు వీలుగా మినీ కాన్ఫరెన్స్ హాల్
 - సీఎం, ఆర్టీజీఎస్ డైరెక్టర్ కార్యాలయాలు
 
ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాల ఏర్పాటుకు 2018లోనే తెదేపా ప్రభుత్వం ప్రతిపాదించింది. కొన్ని జిల్లాల్లో పనులు ప్రారంభించింది. వైకాపా ప్రభుత్వం పనులను పక్కన పెట్టేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఈ ఏడాది ఆఖరుకు రాష్ట్రస్థాయి కేంద్రంతో పాటు.. 13 జిల్లా ప్రాజెక్టులనూ పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఎన్సీసీ-మ్యాట్రిక్స్ ప్రాజెక్టు అమలు బాధ్యతలు నిర్వహిస్తోంది. థర్డ్పార్టీ ఆడిట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కమిటీ(పీఎంసీ)గా కాలేజ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తోంది.
జిల్లా ఆర్టీజీఎస్ కేంద్రాల్లో ఇలా..
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
 - జిల్లా రియల్టైమ్ గవర్నెన్స్, సీసీటీవీ డేటా సెంటర్
 - ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ జిల్లాస్థాయి నెట్వర్క్ సెంటర్
 - కలెక్టర్, ఎస్పీలు సమీక్షించేందుకు సమావేశ మందిరం.
 
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ప్రపంచకప్ గెలిచిన జట్టులో మా అమ్మాయి ఉండటంపై గర్విస్తున్నాం
మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడం, అందులో తమ కుమార్తె భాగస్వామ్యం కావడంపై గర్వపడుతున్నామని భారత మహిళల జట్టు క్రీడాకారిణి శ్రీచరణి తల్లిదండ్రులు నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రేణుక తెలిపారు. - 
                                    
                                        

జాతీయ ఆరోగ్య మిషన్ అమలుపై సీఆర్ఎం బృందం ఆరా
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కార్యక్రమాల అమలు తీరు పరిశీలనకు 12 మందితో కూడిన కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ఎం) బృందం సోమవారం రాష్ట్రానికి వచ్చింది. - 
                                    
                                        

తీరు మార్చుకోకపోతే బుద్ధి చెబుతాం
వైకాపా నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మహిళలపై మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన తన తీరును మార్చుకోకపోతే బుద్ధి చెబుతామని తెదేపా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ హెచ్చరించారు. - 
                                    
                                        

వైకాపా నాయకులు భూమి ఆక్రమించారు
వైకాపా మద్దతుదారులు తన స్థలాన్ని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన యశోద వాపోయారు. ఈ మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. - 
                                    
                                        

రూ.50 కోట్లు దాటిన బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ డిపాజిట్లు
ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధంగా ఉన్న బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ తొలిసారిగా డిపాజిట్ల సేకరణలో రూ.50 కోట్ల మైలురాయిని దాటింది. - 
                                    
                                        

‘ఉపాధి’లో మెరిసిన రాష్ట్రం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మెరిసింది. 2025-26లో ఇప్పటివరకు పనిదినాల వినియోగంలో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. - 
                                    
                                        

ప్రభుత్వాసుపత్రిలో దౌర్జన్యంపై కేసు
పోలీసులను దౌర్జన్యంగా తోసేసి.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అద్దాలు పగలగొట్టిన ఘటనపై వైకాపా నేత జోగి రమేష్ భార్య, ఇద్దరు కుమారులు, మరికొందరిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. - 
                                    
                                        

టీచరమ్మా ఇది తగునా?
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. - 
                                    
                                        

5 వేల హెక్టార్లలో బీచ్శాండ్ లీజులకు ప్రయత్నాలు
అణుధార్మికతతో కూడిన అరుదైన ఖనిజాలు ఉండే బీచ్శాండ్ తవ్వకాల కోసం మరో 5 వేల హెక్టార్లలో లీజులు పొందేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రయత్నాలు చేస్తోంది. - 
                                    
                                        

పోలవరం పనులే చేస్తున్నప్పుడు విద్యుత్తు సబ్స్టేషన్ల పనులు పూర్తి చేయలేరా?
విద్యుత్తు లైన్లు.. 132, 140, 400కేవీ వంటి సబ్స్టేషన్ల పనులనూ సకాలంలో పూర్తి చేయలేరా? అని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ(పీయూసీ) ట్రాన్స్కో అధికారులను నిలదీసింది. - 
                                    
                                        

‘రుణాల పంపిణీ.. డిజిటలైజేషన్లో భారీ అక్రమాలున్నాయ్’
వైకాపా హయాం(2019-24)లో సహకార వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ప్రత్యేక సభా సంఘం అభిప్రాయపడింది. 2019-24 మధ్య ఆప్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, పీఏసీఎస్లలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన సభాసంఘం.. అసెంబ్లీ కమిటీ హాలులో సోమవారం సమావేశమైంది. - 
                                    
                                        

ఇటలీ వాసి.. గోరింటకు మురిసి
విశ్వశాంతి కాంక్షిస్తూ ఇటలీ దేశీయుడైన జాన్ సైకిల్పై ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్, తుర్కియే, ఇండోనేసియా, జర్మనీ తదితర దేశాల్లో యాత్ర పూర్తిచేశారు. - 
                                    
                                        

ఈ దండలను ఎంచక్కా తినేయొచ్చు!
పాయసంలోకి కమ్మని రుచిని ఇచ్చేది జీడిపప్పు. అదే జీడిపప్పుతో చేసిన దండలను నూతన వధూవరులు, రాజకీయ నాయకుల మెడలో వేస్తే ప్రత్యేకమే కదా. - 
                                    
                                        

కోటి కాంతుల అఖండ జ్యోతి
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడిలో ఏటా కార్తిక పౌర్ణమి రోజు కోదండరాముడి తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. - 
                                    
                                        

విజయనగరంలోనూ డబ్బావాలా..
వ్యక్తిగత పని అనో, ఉద్యోగమనో, వ్యాపారమనో చాలా మంది ఉదయం నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఓ వైపు పాఠశాలలకు పిల్లల్ని సిద్ధం చేస్తూనే వారికి అల్పాహారం వండుతూ తీరిక లేకుండా ఉంటారు. - 
                                    
                                        

వ్యర్థానికి అర్థం.. చిన్నారులకు ఆహ్లాదం
ఎందుకూ పనికి రావని పక్కన పడేసే వాహనాల టైర్లను సరికొత్తగా వినియోగించవచ్చని నిరూపించారు గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు. - 
                                    
                                        

అబ్బో.. ఎంత పొడగరో!
తిరుమలలో ఓ విదేశీ మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉన్న శ్రీలంకకు చెందిన నెట్బాల్ ప్లేయర్ తార్జిని శివలింగం సోమవారం సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. - 
                                    
                                        

వేద పాఠశాల నిర్మాణానికి… 2 ఎకరాల భూమి.. 2 కోట్ల నగదు
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వేద పాఠశాల నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. - 
                                    
                                        

మా పార్టీ ఇచ్చిన స్క్రిప్టే చదివాను.. వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు: శ్యామల
కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటనకు అసలు కారణాలు తనకు తెలియవని.. వైకాపా ప్రతినిధులు ఇచ్చిన స్క్రిప్టే చదివానని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల తేల్చిచెప్పారు. - 
                                    
                                        

ముక్కంటికి కార్తిక హారతి
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పుష్కరిణి వద్ద నిర్వహించిన లక్ష దీపోత్సవం కనుల పండువగా జరిగింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


