ముక్కంటికి కార్తిక హారతి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Nov 2025 06:03 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

స్వామి, అమ్మవార్లకు హారతులు ఇస్తున్న అర్చకులు  

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పుష్కరిణి వద్ద నిర్వహించిన లక్ష దీపోత్సవం కనుల పండువగా జరిగింది. సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో కార్తిక దీపాలు వెలిగించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేదికపై కొలువుదీర్చారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా స్వామి, అమ్మవార్లకు పూజలు చేసి దశవిధ హారతులు సమర్పించారు. తర్వాత భక్తులు పుష్కరిణి మెట్లపై దీపాలు వెలిగించారు. 

పుష్కరిణికి హారతి ఇస్తున్న అర్చకుడు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు