Anantapur: సౌదీ నుంచి అనంత చేరిన నిజాం

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 31 Oct 2025 08:48 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మంత్రి లోకేశ్, అనంతపురం ఎమ్మెల్యే చొరవతో ఇంటికి 

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, దగ్గుపాటి, లోకేశ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న నిజాం

అనంతపురం (కమలానగర్‌), న్యూస్‌టుడే: సౌదీలో ఇబ్బందులు ఎదుర్కొని అక్కడి మసీదులో తలదాచుకొని రక్షించాలని వేడుకున్న నిజాంను గురువారం సురక్షితంగా ఇంటికి చేర్చారు.  వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురంలోని ఆజాద్‌నగర్‌కు చెందిన నిజాం డ్రైవర్‌గా జీవనం సాగించేవారు. భార్య రేష్మ, పిల్లలు సోను, సోహైల్‌ఖాన్‌ ఉన్నారు. సోహైల్‌ఖాన్‌ క్రికెట్‌ ఆడుతుండగా బ్యాటు తగిలి కిడ్నీ సమస్య ఏర్పడింది. ఆపరేషన్‌కు రూ.12 లక్షల వరకు అప్పులు చేశారు. వీటిని తీర్చడానికి మరో దారిలేక 3 నెలల క్రితం సౌదీకి వెళ్లారు. అక్కడ తన యజమాని చిత్రహింసలు పెడుతున్నారని వీడియో ద్వారా నిజాం ఆవేదన వ్యక్తం చేశారు. తప్పించుకొని ఓ మసీదులో పది రోజులుగా తలదాచుకుంటున్నట్లు తెలిపారు. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో స్థానిక కార్పొరేటర్‌ రాయల్‌ మధు.. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే, మంత్రి లోకేశ్‌ చొరవతో సౌదీలో ఉన్న తెలుగు సంఘం నాయకులతో మాట్లాడి మసీదు ప్రాంతంలో ఉన్న నిజాంను సురక్షితంగా నివాసానికి తీసుకెళ్లారు. అయితే యజమాని నిజాంపై కేసులు నమోదు చేయించడంతో తెలుగు సంఘం నాయకులు వివరణ ఇచ్చారు. ఇందుకు నెల సమయం పట్టింది. తర్వాత ఆయనను ఎమ్మెల్యే సొంత ఖర్చుతో అనంతపురానికి తీసుకొచ్చారు. ఇంటికి చేరాక నిజాం కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, దగ్గుపాటి చిత్రాలకు క్షీరాభిషేకం చేశారు.

Tags :
Published : 31 Oct 2025 08:48 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు