Andhra News: 5.44 లక్షలమంది అన్నదాతలకు ‘సుఖీభవ’
వెబ్ల్యాండ్లోని ఆధార్ సీడింగ్లో తప్పుల దిద్దుబాటు  
రూ.2.72 కోట్ల మేర ఛార్జీ మినహాయించిన ప్రభుత్వం
ఈనాడు - అమరావతి 

వెబ్ల్యాండ్లో గతంలో పట్టాదారుల పేర్లతో తప్పుగా నమోదైన ఆధార్ నంబర్లను సరిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సర్వీసు ఛార్జీ రూపంలో వసూలు చేయాల్సిన రూ.2.72 కోట్లకు మినహాయింపు ఇచ్చింది. తద్వారా వీరందరికి ‘అన్నదాతా సుఖీభవ’ ప్రయోజనాలు అందనున్నాయి. రాష్ట్రంలో 5.44 లక్షల మంది అర్హులైన రైతులు తొలివిడతలో ఈ పథకం కింద ఆర్థిక సాయాన్ని పొందలేకపోయారు. సర్వే నంబరు, విస్తీర్ణం, ఇతర వివరాలన్నీ సరిగానే ఉన్నా వెబ్ల్యాండ్లో ఆధార్ నంబర్లు తప్పుగా నమోదు కావడమే దీనికి కారణం. కొందరికి రైతు పేరు, తండ్రి పేర్లలో అక్షర దోషాలున్నాయి. పాత సర్వే నంబర్లే కాకుండా.. రీసర్వే తర్వాత నమోదైన ఎల్పీఎం నంబర్లకు కూడా ఆధార్, మొబైల్ నంబర్లు, పేర్లు తప్పుగా నమోదయ్యాయి.
ఇలాంటి రైతుల జాబితా వ్యవసాయశాఖ నుంచి రెవెన్యూ శాఖకు చేరినా కొన్ని నెలలుగా పరిష్కారం కావడం లేదు. తహసీల్దారు లాగిన్లో పెండింగ్లో ఉన్నాయి. వాటిని సరిదిద్దాలంటే మొబైల్ నంబర్, ఆధార్ సీడింగ్ కింద లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుని రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సమస్య పరిష్కారంలో భాగంగా ఈ ఛార్జి వసూలు చేయకుండానే సర్వే నంబరు/ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్పీఎం)తో పట్టాదారు ఆధార్ నంబర్లు మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్నదాతా సుఖీభవ పథకానికి వ్యవసాయశాఖ పరిశీలించిన 5.44 లక్షల మంది రైతులకు దీన్ని వర్తింపజేయాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు.
అన్నదాతల సమస్యలివి
- ఆధార్ తప్పుగా లింక్ చేయడం
 - ఒకే ఆధార్ నంబరు పలువురు పట్టాదారుల పేర్లతో నమోదు చేయడం
 - పట్టాదారులకు ఆధార్ లింక్ చేయకపోవడం
 
జిల్లాల వారీగా తహసీల్దారు లాగిన్లో పెండింగ్లో ఉన్న రికార్డులు
శ్రీకాకుళం 76,060, విజయనగరం 74,155, తిరుపతి 58,557, ప్రకాశం 42,578, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 38,448, అన్నమయ్య 25,313, అనకాపల్లి 23,163, బాపట్ల 20,849, కృష్ణా 17,175, చిత్తూరు 16,608, పల్నాడు 16,268, కాకినాడ 15,955, వైఎస్సార్ కడప 15,438, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు 14,482, నంద్యాల 14,477, ఏలూరు 13,397, అల్లూరి సీతారామరాజు 11,519, ఎన్టీఆర్ 9,879, గుంటూరు 7,454, పార్వతీపురం మన్యం 7,000, శ్రీసత్యసాయి 6,274, అనంతపురం 4,278, కర్నూలు 4,189, తూర్పుగోదావరి 3989, పశ్చిమగోదావరి 3,630, విశాఖపట్నం 3,188.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆధారాలతో బయటపడిన అసలు రంగు
తామే నకిలీ మద్యం వ్యవహారాన్ని వెలికి తీయించామని.. మేం లేకపోతే కూటమి ప్రభుత్వం నీరుగార్చేది అంటూ ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం యూనిట్, సీసాలను స్వాధీనం చేసుకున్న సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడకు వచ్చి నానా యాగీ చేశారు. - 
                                    
                                        

అన్నపూర్ణ భర్తకు నైవేద్యాలకు కొదవా?
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని సీతారామాలయంలో శనివారం రాత్రి గౌరీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. - 
                                    
                                        

జాతీయ రహదారి 2 నెలలకే.. రెండు ముక్కలు!
కొత్తగా వేసిన రోడ్డుపై రాకపోకలు ప్రారంభించి రెండు నెలలైనా కాలేదు. అప్పుడే పగుళ్లిచ్చింది. దీంతో వివిధ సాకులతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. - 
                                    
                                        

రాయిచేప అందం.. ముళ్లకప్ప చందం
విశాఖలోని రుషికొండ బీచ్ సమీప సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు విభిన్న రకాల జీవులు చిక్కాయి. ఆకర్షణీయంగా పసుపు తోక కలిగిన రాయి చేపలతో పాటు ములుగుపాములు, ముళ్లకప్పలు లభ్యమయ్యాయి. - 
                                    
                                        

జోగి పాత్ర తేలడంతోనే అరెస్టు: ఎక్సైజ్ మంత్రి రవీంద్ర
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టయ్యారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. - 
                                    
                                        

సచిన్ను కలిసిన లోకేశ్ దంపతులు
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను కలిశారు. ‘‘ఇది ఫ్యాన్ బాయ్ క్షణం. ఈ రోజు లెజెండ్ను కలిసే అదృష్టం లభించింది. ఆయన వినయం, ఆప్యాయతల గురించి ఇప్పటి వరకూ వినడమే. - 
                                    
                                        

తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు
కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. - 
                                    
                                        

బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. - 
                                    
                                        

శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఆదివారం వైభవంగా జరిగింది. - 
                                    
                                        

అన్నవరంలో వైభవంగా తెప్పోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. - 
                                    
                                        

మొంథా బాధిత చేనేత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా
మొంథా తుపాను కారణంగా నష్టపోయిన చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. నీట మునిగిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారాన్ని అందించనున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత తెలిపారు. - 
                                    
                                        

తెలుగు భాషా, సాహిత్య సంపద పరిరక్షణ అవశ్యం
తెలుగు భాషా, సాహిత్య సంపదను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. - 
                                    
                                        

మహిళల విజయోత్సాహం వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లు
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఆదివారం జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు రాష్ట్రంలోని పలు క్రీడా మైదానాలు, కళాశాలల వద్ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో డిజిటల్, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. - 
                                    
                                        

‘చంద్రబాబూ ఖబడ్దార్.. లోకేశ్ జాగ్రత్త!’.. వేలు చూపిస్తూ జోగి రమేష్ హెచ్చరికలు
‘చంద్రబాబూ ఖబడ్దార్.. లోకేశ్ జాగ్రత్త’ అని వేలు చూపిస్తూ.. వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘చంద్రబాబు నీకూ కుటుంబముంది. - 
                                    
                                        

ముఖం కడుక్కోండి.. నిద్రమత్తు వీడండి
రాత్రివేళ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎక్కువగా ప్రమాదాలకు నిద్రమత్తే కారణమని గుర్తించి, వాహన డ్రైవర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. - 
                                    
                                        

నకిలీ మద్యం తయారు చేయించింది ఆయనే
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేషేనని ఎక్సైజ్, సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. - 
                                    
                                        

తొక్కిసలాట ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే జోగి అరెస్టు
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే మాజీ మంత్రి జోగి రమేష్ను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించిందని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. - 
                                    
                                        

తెలియదు.. సంబంధం లేదు.. గుర్తులేదు!
‘నాకు తెలియదు, సంబంధం లేదు. గుర్తులేదు..’ సిట్ విచారణలో ఎక్కువ ప్రశ్నలకు నకిలీ మద్యం కేసు నిందితుడు జోగి రమేష్ ఇచ్చిన సమాధానాలివే. - 
                                    
                                        

మాజీ మంత్రే సూత్రధారి: అనగాని సత్యప్రసాద్
రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ సూత్రధారి మాజీ మంత్రి జోగి రమేష్ అయితే.. పాత్రధారి అద్దేపల్లి జనార్దన్రావు ముఠా అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. - 
                                    
                                        

జనార్దన్రావుతో ‘జోగి’ సంబంధాలపై ఆధారాలు: సాదినేని యామినీ శర్మ
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్దన్రావుతో నేరుగా సంబంధాలు ఉన్నట్టు సిట్ పక్కా ఆధారాలు సేకరించిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ తెలిపారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

త్వరలో ఆదరణ-3 పథకం అమలు: మంత్రి సవిత
 - 
                        
                            

సమర్థ నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్
 - 
                        
                            

పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు మార్చండి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
 - 
                        
                            

రూ.3వేల కోట్లు కొల్లగొట్టారు.. డిజిటల్ అరెస్టులపై కఠినచర్యలు: సుప్రీంకోర్టు
 - 
                        
                            

తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
 - 
                        
                            

కప్పు గెలిచిన అమ్మాయిలకు డైమండ్ నెక్లెస్లు.. వ్యాపారి గిఫ్ట్
 


