తెలుగు భాషా, సాహిత్య సంపద పరిరక్షణ అవశ్యం
పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

జానమద్ది సాహితీపీఠం రూపొందించిన సీడీని ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు, జస్టిస్ వెంకట జ్మోతిర్మయి ప్రతాప. చిత్రంలో ఎస్బీఐ డీజీఎం హేమ, అవధాని మేడసాని మోహన్, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, రేవూరి అనంత పద్మనాభరావు, సంగీత దర్శకుడు బాబు ప్రసాద్, యలమర్తి మధుసూదన, యోగివేమన యూనివర్సిటీ వీసీ రాజశేఖర్, జానమద్ది విజయభాస్కర్, చంద్రశేఖర్రెడ్డి, గుమ్మడి గోపాలకృష్ణ, అంకేగౌడ
ఈనాడు, కడప: తెలుగు భాషా, సాహిత్య సంపదను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కడప పర్యటనలో భాగంగా ఆదివారం సీపీ బ్రౌన్ సాహిత్య పరిశోధన గ్రంథాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపతో కలిసి ఆదివారం సందర్శించారు. అనంతరం జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో బ్రౌన్ గ్రంథాలయంలో నిర్వహించిన హనుమచ్ఛాస్త్రి శత జయంత్యుత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. విదేశీయుడైన సీపీ బ్రౌన్ రాష్ట్రానికి వచ్చి తెలుగు భాషకు చేసిన కృషిని కొనియాడారు. ప్రతి ఊళ్లో ఒక దేవాలయం, విద్యాలయం, సేవాలయం, గ్రంథాలయం నెలకొల్పేలా సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. మాతృభాషలో పరిపాలన ఉత్తర్వులు సాగాలని, న్యాయమూర్తులు తీర్పులను తెలుగులోనే ఇవ్వాలని సూచించారు.
సామాజిక మాధ్యమాలు, సాంకేతిక విద్య స్వదేశీ భాషలోనే అందించాలంటూ.. ఈ కోణంలోనూ ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని వివరించారు. బ్రౌన్ గ్రంథాలయ అభివృద్ధికి తన కుమార్తె నిర్వహించే స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. సీపీ బ్రౌన్ స్మారక గ్రంథాలయంలో 50 వేలకు పైగా పుస్తకాలతో పాటు 200 తాళపత్ర గ్రంథాలను సేకరించి శుద్ధి చేసి.. వాటిని స్కాన్ చేసి భద్రపర్చడం అభినందనీయమన్నారు. న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మాట్లాడుతూ యువతరం, తెలుగు భాషా ప్రేమికులు సీపీ బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించాలని సూచించారు.
హనుమచ్ఛాస్త్రి శతజయంతి సందర్భంగా ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, అవధాని మేడసాని మోహన్, గ్రంథాల సంరక్షకులు ఎం.అంకేగౌడ, సాహితీవేత్త రేవూరు అనంత పద్మనాభరావుకు పురస్కారాలు ప్రదానం చేశారు. జానమద్ది సాహితీపీఠం మేనేజింగ్ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్ సేవలను అతిథులు ప్రశంసించారు. కార్యక్రమంలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, యోగివేమన విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో పుస్తకాలను పరిశీలిస్తున్న వెంకయ్యనాయుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

రాయిచేప అందం.. ముళ్లకప్ప చందం
విశాఖలోని రుషికొండ బీచ్ సమీప సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు విభిన్న రకాల జీవులు చిక్కాయి. ఆకర్షణీయంగా పసుపు తోక కలిగిన రాయి చేపలతో పాటు ములుగుపాములు, ముళ్లకప్పలు లభ్యమయ్యాయి. - 
                                    
                                        

అన్నపూర్ణ భర్తకు నైవేద్యాలకు కొదవా?
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని సీతారామాలయంలో శనివారం రాత్రి గౌరీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. - 
                                    
                                        

జోగి పాత్ర తేలడంతోనే అరెస్టు: ఎక్సైజ్ మంత్రి రవీంద్ర
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టయ్యారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. - 
                                    
                                        

ఆధారాలతో బయటపడిన అసలు రంగు
తామే నకిలీ మద్యం వ్యవహారాన్ని వెలికి తీయించామని.. మేం లేకపోతే కూటమి ప్రభుత్వం నీరుగార్చేది అంటూ ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం యూనిట్, సీసాలను స్వాధీనం చేసుకున్న సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడకు వచ్చి నానా యాగీ చేశారు. - 
                                    
                                        

సచిన్ను కలిసిన లోకేశ్ దంపతులు
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను కలిశారు. ‘‘ఇది ఫ్యాన్ బాయ్ క్షణం. ఈ రోజు లెజెండ్ను కలిసే అదృష్టం లభించింది. ఆయన వినయం, ఆప్యాయతల గురించి ఇప్పటి వరకూ వినడమే. - 
                                    
                                        

తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు
కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. - 
                                    
                                        

జాతీయ రహదారి 2 నెలలకే.. రెండు ముక్కలు!
కొత్తగా వేసిన రోడ్డుపై రాకపోకలు ప్రారంభించి రెండు నెలలైనా కాలేదు. అప్పుడే పగుళ్లిచ్చింది. దీంతో వివిధ సాకులతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. - 
                                    
                                        

బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. - 
                                    
                                        

శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఆదివారం వైభవంగా జరిగింది. - 
                                    
                                        

అన్నవరంలో వైభవంగా తెప్పోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. - 
                                    
                                        

మొంథా బాధిత చేనేత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా
మొంథా తుపాను కారణంగా నష్టపోయిన చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. నీట మునిగిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారాన్ని అందించనున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత తెలిపారు. - 
                                    
                                        

మహిళల విజయోత్సాహం వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లు
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఆదివారం జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు రాష్ట్రంలోని పలు క్రీడా మైదానాలు, కళాశాలల వద్ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో డిజిటల్, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. - 
                                    
                                        

‘చంద్రబాబూ ఖబడ్దార్.. లోకేశ్ జాగ్రత్త!’.. వేలు చూపిస్తూ జోగి రమేష్ హెచ్చరికలు
‘చంద్రబాబూ ఖబడ్దార్.. లోకేశ్ జాగ్రత్త’ అని వేలు చూపిస్తూ.. వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘చంద్రబాబు నీకూ కుటుంబముంది. - 
                                    
                                        

ముఖం కడుక్కోండి.. నిద్రమత్తు వీడండి
రాత్రివేళ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎక్కువగా ప్రమాదాలకు నిద్రమత్తే కారణమని గుర్తించి, వాహన డ్రైవర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. - 
                                    
                                        

నకిలీ మద్యం తయారు చేయించింది ఆయనే
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేషేనని ఎక్సైజ్, సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. - 
                                    
                                        

తొక్కిసలాట ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే జోగి అరెస్టు
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే మాజీ మంత్రి జోగి రమేష్ను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించిందని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. - 
                                    
                                        

తెలియదు.. సంబంధం లేదు.. గుర్తులేదు!
‘నాకు తెలియదు, సంబంధం లేదు. గుర్తులేదు..’ సిట్ విచారణలో ఎక్కువ ప్రశ్నలకు నకిలీ మద్యం కేసు నిందితుడు జోగి రమేష్ ఇచ్చిన సమాధానాలివే. - 
                                    
                                        

మాజీ మంత్రే సూత్రధారి: అనగాని సత్యప్రసాద్
రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ సూత్రధారి మాజీ మంత్రి జోగి రమేష్ అయితే.. పాత్రధారి అద్దేపల్లి జనార్దన్రావు ముఠా అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. - 
                                    
                                        

జనార్దన్రావుతో ‘జోగి’ సంబంధాలపై ఆధారాలు: సాదినేని యామినీ శర్మ
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్దన్రావుతో నేరుగా సంబంధాలు ఉన్నట్టు సిట్ పక్కా ఆధారాలు సేకరించిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ తెలిపారు. - 
                                    
                                        

ఆలయాల్లో ఏర్పాట్లు అంతంత మాత్రమే..
మొక్కకు రక్షణ కోసం ఇనుప కంచె ఏర్పాటుచేస్తాం. మొక్క మానైనప్పుడు ఆ ఇనుప కంచే దానికి అడ్డొస్తుంది. అలాగే ఆలయాల్లో క్యూలో పంపేందుకు, భక్తుల రక్షణ కోసం రెయిలింగ్లు, బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్కు రిమాండ్
 - 
                        
                            

రూ.25 లక్షల చికిత్స... నిమ్స్లో ఉచితం!
 - 
                        
                            

ఈ విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తి: ప్రధాని మోదీ
 - 
                        
                            

విజయవాడ ఆస్పత్రి వద్ద జోగి రమేశ్ అనుచరుల హంగామా
 - 
                        
                            

సచిన్ వినయం, మానవత్వం ప్రత్యక్షంగా చూశా: మంత్రి నారా లోకేశ్
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/11/2025)
 


