Weight Loss: జుంబారే.. బరువు తగ్గారే!

బోరింగ్ వ్యాయామాలతో విసిగెత్తిపోతున్నారా..? బిజీలైఫ్, బద్ధకంతో.. వ్యాయామం చేయలేకపోతున్నారా..? అయితే.. మ్యూజిక్ వింటూ ఓ స్టెప్పెయ్యండి.. సాంగ్స్ పెట్టుకుని లయబద్ధంగా డ్యాన్స్ చేయండి. అటు ఆనందం, ఇటు ఆరోగ్యాన్ని సొంతం చేసే ఈ విధానమే జుంబా!
- లావణ్య గృహిణి. ఇంట్లోనే ఖాళీగా ఉండటం, టీవీ చూస్తూ మోతాదుకు మించి తినడం ద్వారా అధికంగా బరువు పెరిగి అనారోగ్యానికి గురైంది. వైద్యులు బరువు తగ్గాలని సూచించారు. జుంబా సెంటర్లో చేరింది. ప్రత్యేకంగా ఓ ట్రైనర్ను కూడా పెట్టుకుని మోతాదులో ఆహారం తీసుకుని వర్కవుట్లు చేయడం మొదలెట్టింది. ఎనిమిది నెలల్లో ఆరు కేజీల వరకు బరువు తగ్గింది.
 
రోజూ జిమ్కు వెళ్లడం, వాకింగ్ చేయడాన్ని బోరింగ్గా ఫీలయ్యే వారెందరో. ఇలాంటివారు ఫన్గా.. ఫిట్గా మారేందుకు జుంబా సెంటర్లు మంచి వేదికలుగా మారుతున్నాయి. 12 ఏళ్ల చిన్నారుల నుంచి 50 ఏళ్ల గృహిణుల వరకు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. థైరాయిడ్, పీసీఓడీ, అధిక బరువు, తదితర ఇబ్బందులతో బాధపడే మహిళలు జుంబా వ్యాయామంతో నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మహిళలకే ప్రత్యేకమైన జుంబా సెంటర్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మహిళలు అధికంగా ఈ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.
ఫన్తో ఫిట్నెస్..
జుంబాలో ఫాస్ట్, స్లో డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి. శరీరంలో ప్రతి అవయవ కండరాన్ని ఈ వ్యాయామం కదిలిస్తుంది. కండరాలను పటిష్ఠం చేస్తుంది. రోజూ ఈ వ్యాయామం చేయడం ద్వారా సామర్థ్యం పెరిగి, నిస్సత్తువ దూరమవుతుంది. ఈ డ్యాన్స్ సక్రమంగా చేయించేందుకు ఓ సర్టిఫైడ్ మహిళా ట్రైనర్ కూడా ఉంటారు. శరీరమంతా కదిలేలా, విసుగు చెందకుండా స్టెప్పులు వేయిస్తూ వ్యాయామం చేయిస్తారు. శరీరంలో ఎక్కడ అధిక మోతాదులో కొవ్వు ఉన్నా.. బాల్ వర్కవుట్ (కండరాల బలోపేతం), స్టెప్పర్ (తొడల బలోపేతం), కోర్ స్ట్రెంగ్త్ వంటి వ్యాయామాలు చేయిస్తారు.
ప్రత్యేకంగా డైట్ ఛార్ట్
- అరగంటపాటు జుంబా డ్యాన్స్ చేస్తే క్యాలరీలు కరుగుతాయి.
 - వీటికి సరిపడా క్యాలరీలు దొరికే డైట్ ఛార్ట్ను సెంటర్లోని న్యూట్రిషనిస్ట్ సూచిస్తారు. జుంబా చేసే సమయంలో కాస్త నీరసానికి గురయినా.. బీట్రూట్, క్యారెట్, కీరాతో చేసిన డ్రింక్లను తక్షణ శక్తి కింద ఇస్తారు. శరీర సామర్థ్యాన్ని బట్టి మిల్లెట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు, బ్రౌన్ రైస్, సీడ్స్ వంటి ఆహారాన్నీ సూచిస్తారు.
 - సెంటర్లలో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఉంటారు. వారే డైట్ను సూచిస్తారు. కొన్ని సెంటర్లు ప్రత్యేక ఛార్జీలు తీసుకుని డైట్ అందిస్తున్నాయి.
 
ఇవీ ప్రయోజనాలు..
- జుంబా డ్యాన్స్తో శ్రమ పడినట్లు తెలియకుండానే శరీరానికి అవసరమైనంత వ్యాయామం అందుతుంది.
 - శరీరంలో కొవ్వు పరిమాణం తగ్గి నాజూగ్గా తయారవుతారు.
 - శరీరం దృఢంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
 - కండరాలు పటిష్ఠంగా తయారవుతాయి.
 - ఈ డ్యాన్స్తో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
 - పెద్ద పెద్ద బరువులు ఎత్తకుండానే బరువు తగ్గొచ్చు.
 - మహిళలు థైరాయిడ్, పీసీఓడీ నుంచి బయటపడొచ్చు.
 
ఆహారనియంత్రణపై అవగాహన అవసరం..
- పి.దర్పిత, డైటీషియన్, ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్ (అనకాపల్లి)
జుంబా డ్యాన్స్ గుండె కొవ్వు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రోజుకు ఒక గంట జుంబా చేస్తే.. 300 నుంచి 600 క్యాలరీలను కరిగించవచ్చు. ఏరోబిక్స్ కంటే.. జుంబా ద్వారా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. సాధారణంగా శరీరానికి అవసరమైన ప్రొటీన్ను అందేలా చూసుకోవాలి. జుంబా చేసిన తర్వాత కూల్ డ్రింక్స్, మద్యం, హోం స్ట్రింగ్స్, జంక్ ఫుడ్ తీసుకోకూడదు. ఆహార నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలి. అవసరమైతే నిపుణులను సంప్రదించాలి. గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో జుంబా చేయాలి.
-ఈనాడు డిజిటల్, అనకాపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆధారాలతో బయటపడిన అసలు రంగు
తామే నకిలీ మద్యం వ్యవహారాన్ని వెలికి తీయించామని.. మేం లేకపోతే కూటమి ప్రభుత్వం నీరుగార్చేది అంటూ ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం యూనిట్, సీసాలను స్వాధీనం చేసుకున్న సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడకు వచ్చి నానా యాగీ చేశారు. - 
                                    
                                        

అన్నపూర్ణ భర్తకు నైవేద్యాలకు కొదవా?
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని సీతారామాలయంలో శనివారం రాత్రి గౌరీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. - 
                                    
                                        

జాతీయ రహదారి 2 నెలలకే.. రెండు ముక్కలు!
కొత్తగా వేసిన రోడ్డుపై రాకపోకలు ప్రారంభించి రెండు నెలలైనా కాలేదు. అప్పుడే పగుళ్లిచ్చింది. దీంతో వివిధ సాకులతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. - 
                                    
                                        

రాయిచేప అందం.. ముళ్లకప్ప చందం
విశాఖలోని రుషికొండ బీచ్ సమీప సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు విభిన్న రకాల జీవులు చిక్కాయి. ఆకర్షణీయంగా పసుపు తోక కలిగిన రాయి చేపలతో పాటు ములుగుపాములు, ముళ్లకప్పలు లభ్యమయ్యాయి. - 
                                    
                                        

జోగి పాత్ర తేలడంతోనే అరెస్టు: ఎక్సైజ్ మంత్రి రవీంద్ర
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టయ్యారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. - 
                                    
                                        

సచిన్ను కలిసిన లోకేశ్ దంపతులు
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను కలిశారు. ‘‘ఇది ఫ్యాన్ బాయ్ క్షణం. ఈ రోజు లెజెండ్ను కలిసే అదృష్టం లభించింది. ఆయన వినయం, ఆప్యాయతల గురించి ఇప్పటి వరకూ వినడమే. - 
                                    
                                        

తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు
కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. - 
                                    
                                        

బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. - 
                                    
                                        

శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఆదివారం వైభవంగా జరిగింది. - 
                                    
                                        

అన్నవరంలో వైభవంగా తెప్పోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. - 
                                    
                                        

మొంథా బాధిత చేనేత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా
మొంథా తుపాను కారణంగా నష్టపోయిన చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. నీట మునిగిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారాన్ని అందించనున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత తెలిపారు. - 
                                    
                                        

తెలుగు భాషా, సాహిత్య సంపద పరిరక్షణ అవశ్యం
తెలుగు భాషా, సాహిత్య సంపదను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. - 
                                    
                                        

మహిళల విజయోత్సాహం వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లు
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఆదివారం జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు రాష్ట్రంలోని పలు క్రీడా మైదానాలు, కళాశాలల వద్ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో డిజిటల్, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. - 
                                    
                                        

‘చంద్రబాబూ ఖబడ్దార్.. లోకేశ్ జాగ్రత్త!’.. వేలు చూపిస్తూ జోగి రమేష్ హెచ్చరికలు
‘చంద్రబాబూ ఖబడ్దార్.. లోకేశ్ జాగ్రత్త’ అని వేలు చూపిస్తూ.. వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘చంద్రబాబు నీకూ కుటుంబముంది. - 
                                    
                                        

ముఖం కడుక్కోండి.. నిద్రమత్తు వీడండి
రాత్రివేళ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎక్కువగా ప్రమాదాలకు నిద్రమత్తే కారణమని గుర్తించి, వాహన డ్రైవర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. - 
                                    
                                        

నకిలీ మద్యం తయారు చేయించింది ఆయనే
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేషేనని ఎక్సైజ్, సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. - 
                                    
                                        

తొక్కిసలాట ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే జోగి అరెస్టు
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే మాజీ మంత్రి జోగి రమేష్ను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించిందని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. - 
                                    
                                        

తెలియదు.. సంబంధం లేదు.. గుర్తులేదు!
‘నాకు తెలియదు, సంబంధం లేదు. గుర్తులేదు..’ సిట్ విచారణలో ఎక్కువ ప్రశ్నలకు నకిలీ మద్యం కేసు నిందితుడు జోగి రమేష్ ఇచ్చిన సమాధానాలివే. - 
                                    
                                        

మాజీ మంత్రే సూత్రధారి: అనగాని సత్యప్రసాద్
రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ సూత్రధారి మాజీ మంత్రి జోగి రమేష్ అయితే.. పాత్రధారి అద్దేపల్లి జనార్దన్రావు ముఠా అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. - 
                                    
                                        

జనార్దన్రావుతో ‘జోగి’ సంబంధాలపై ఆధారాలు: సాదినేని యామినీ శర్మ
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్దన్రావుతో నేరుగా సంబంధాలు ఉన్నట్టు సిట్ పక్కా ఆధారాలు సేకరించిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ తెలిపారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
 - 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి.. పలువురికి గాయాలు
 


