Sadineni Yamini: ఏపీకి పెట్టుబడులు వస్తుంటే ఏడుపెందుకు..?

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 07:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీశర్మ

ఈనాడు, అమరావతి: మోదీ ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలు, రాయితీల వల్ల దేశానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని, చంద్రబాబు విజన్‌ వల్ల ఏపీ అభివృద్ధి చెందుతుంటే అడ్డుకోడానికి వైకాపా కుట్రలు పన్నుతోందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీశర్మ విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి స్థిరత్వం లేక ప్రాజెక్టులను కోల్పోతోందని, అవినీతిలో కూరుకుపోయిన ఆ పార్టీ నాయకులు ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్డీయే పాలకుల విజన్‌ వల్ల విశాఖకు గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ వచ్చిందన్నారు. ఇన్నాళ్లూ ప్రతిపక్ష హోదా కావాలని గోల చేసిన జగన్‌.. తుపానుతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే ఎక్కడికెళ్లారని యామినీశర్మ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని