PVN Madhav: ‘మొంథా’ను ఏపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది: పీవీఎన్‌ మాధవ్‌

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 30 Oct 2025 13:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అనంతపురం: మొంథా తుపానును ఏపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ (PVN Madhav) అన్నారు. తుపాను పరిస్థితులపై ప్రధాని స్వయంగా ఆరా తీశారని చెప్పారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తుపానుతో రాష్ట్రంలో అపార పంట నష్టం జరిగిందన్నారు. నష్టం అంచనాకు బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లాయని చెప్పారు. తుపానుతో నష్టపోయిన వారి జాబితాను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. 

తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోందని మాధవ్‌ అన్నారు. శ్రీవాణి, పరకామణితో పాటు అనేక అంశాలపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో తిరుమలలో ఇలాంటివి జరగకుండా చర్యలు ఉండాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని