Cyclone Montha: మొంథా ఎఫెక్ట్‌.. చెట్టు కూలి మహిళ మృతి

Eenadu icon
By Andhra Pradesh News Team Updated : 28 Oct 2025 14:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మామిడికుదురు: కాకినాడ తీరం దిశగా దూసుకువస్తున్న ‘మొంథా’ తీవ్ర తుపాను కారణంగా ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మాకనపాలెంలో చెట్టు కూలి వీరవేణి అనే మహిళ మృతి చెందింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలో తీవ్ర తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. బలిఘట్టం రాజరాజేశ్వరి పర్వతంపై గుడిసెల్లో నివసిస్తున్న వారిని అధికారులు తరలించారు. మొత్తం 55 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు. తుపాను దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వలంధర రేవు- సఖినేటిపల్లి మధ్య పంటు సేవలను నిలిపివేశారు. అల్లూరి జిల్లా పాడేరు మండలం నందిగరువులో చెట్టు కూలడంతో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి.

Tags :
Published : 28 Oct 2025 14:41 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని