Cyclone Montha: అవసరంలేని బస్సులు నిలిపేయండి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 28 Oct 2025 04:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి హాల్ట్‌లు వద్దు
ఆర్టీసీ అధికారులకు ఎండీ ద్వారకాతిరుమలరావు ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ప్రయాణికుల రద్దీ ఉండే రూట్లలోనే బస్సులు నడపాలని, అవసరంలేని రూట్లలో బస్సులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు ఆదేశించారు. దూరప్రాంత సర్వీసులను సైతం ప్రయాణికుల సంఖ్యను బట్టి నడపాలని, లేకపోతే రద్దు చేయాలని, రిజర్వేషన్‌ చేసుకున్న వారికి సర్వీసు రద్దు వివరాలను ముందే తెలియజేయాలన్నారు. మొంథా తుపాను నేపథ్యంలో ఆయన సోమవారం నాలుగు జోన్ల ఈడీలు, ప్రజా రవాణాశాఖ జిల్లా అధికారులతో ఆడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎండీ పలు ఆదేశాలిచ్చారు.

  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి హాల్ట్‌లు ఉంచొద్దు. ఆ బస్సులను డిపోలకు వచ్చేసేలా చూడాలి.
  • ముంపునకు అవకాశం ఉండే కాల్వలు, కాజ్‌వేలు, కట్టల మీదుగా వెళ్లే రూట్లలో బస్సులు నడపవద్దు. వాటిని ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాలి.
  • బలమైన గాలులు వీచి, భారీ వర్షాలు కురిస్తే.. ఆ ప్రాంతాల్లో సర్వీసులు తాత్కాలికంగా నిలిపేయాలి.
  • రద్దుచేసిన బస్సుల వివరాలు బస్‌స్టేషన్లలో ప్రదర్శించాలి. మైక్‌లో ప్రకటించాలి.
  • సోమవారం రాత్రి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోని, విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో రోజంతా పనిచేసే సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
  • వర్షపునీరు నిలిచే అవకాశమున్న డిపోల్లోని బస్సులను ఎత్తైన ప్రాంతానికి తరలించాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు