Cyclone Montha: జలవనరులపై 3 గంటలకో బులెటిన్‌

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 28 Oct 2025 04:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఏపీ వారిమ్స్‌ నుంచి అధికారులకు సందేశాలు  
31 వేల చెరువులు, 16 రిజర్వాయర్లపై దృష్టి 

ఈనాడు, అమరావతి: తుపాను నేపథ్యంలో జలవనరులశాఖ అప్రమత్తమైంది. వాస్సార్‌ ల్యాబ్స్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏపీ వారిమ్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రతి రోజూ రిజర్వాయర్లు, ఇతర అంశాలపై సమగ్ర సమాచారం సిద్ధం చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రస్తుత తుపాను నేపథ్యంలో చెరువులు, కాలువలు, డ్రెయిన్లు, మధ్య తరహా రిజర్వాయర్లను కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయబోతున్నారు. రాష్ట్రంలోని 31 వేల చెరువులు, తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన 16 రిజర్వాయర్లపై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసేలా ఏర్పాట్లు చేశారు.

ఏం చేయబోతున్నారు?

  • తీవ్ర తుపాను నేపథ్యంలో వాతావరణానికి సంబంధించి శాటిలైట్ల సమాచారాన్ని మేళవించి గడిచిన గంట సమాచారం, మరో 12 గంటల భవిష్యత్తు వాతావరణ అంచనాల ఆధారంగా ఎంత వర్షం పడుతుంది? ఎంత ప్రవాహం వస్తుందో లెక్కిస్తారు.
  • జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎన్ని చెరువులున్నాయి, ప్రస్తుతం వాటిలో నీటి స్థాయి, భారీ వర్షాల వల్ల ఆయా చెరువుల్లోకి ఎంత ప్రవాహం, ఎంతసేపట్లో చేరుకోవచ్చు, ఏయే చెరువులు ప్రమాదకరంగా ఉన్నాయి, వేటి విషయంలో అప్రమత్తం కావాల్సి ఉందో అంచనా వేస్తారు.
  • ఇలాగే తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం చుండ్రువారి చెరువుపై అప్రమత్తం చేశారు. ఆ చెరువులో ప్రస్తుతం 0.01 మిలియన్‌ క్యూబిక్‌ అడుగుల ఖాళీ మాత్రమే ఉందని, 1.82 ఎంసీఎఫ్‌టీ ప్రవాహం వచ్చే ఆస్కారం ఉందని అక్కడి అధికారులకు తెలియజేశారు. కోటనందూరు, సామర్లకోట మండలాల్లోని మరో రెండు చెరువుల ప్రమాదకర పరిస్థితిపై వర్తమానం పంపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని