Fake reviews: 5స్టార్ అయినా.. పై పై మెరుగులే!
నకిలీ రివ్యూలతో నష్టాలపాలు

మనీశ్ ఓ ప్రముఖ ఆన్లైన్ సైట్లో ట్రిమ్మర్ కొనుగోలు చేశారు. చాలా కంపెనీల ట్రిమ్మర్ల రేటింగ్లు, రివ్యూలు పరిశీలించాకే దాన్ని ఎంపిక చేశారు. తీరా డెలివరీ అయ్యాక దాని పనితీరు పేలవంగా ఉంది.
మీరు ఆన్లైన్లో ల్యాప్టాపో, మొబైల్ ఫోనో కొనాలనుకున్నారు. లేకపోతే ఓ హోటల్లో రూం బుక్ చేయాలనుకున్నారు. నగరంలో మంచి రెస్టారెంట్ ఏదో తెలుసుకోవాలనుకున్నారు. వెంటనే ఏం చేస్తారు? ఆన్లైన్లోకి వెళ్లి వెబ్సైట్లోనో, సంబంధిత యాప్లోనో దాని గురించి అన్వేషిస్తారు. రేటింగ్లు, రివ్యూలు వెతుకుతారు. దేనికి, ఎవరు, ఎన్ని మంచి రివ్యూలు రాశారో, ఫైవ్స్టార్ రేటింగ్ ఇచ్చారో తెలుసుకుంటారు. ఫైవ్స్టార్ రేటింగ్ కనిపిస్తే.. ఆ ఉత్పత్తి మీద నమ్మకం కుదిరాక బుక్ చేస్తారు. తీరా డెలివరీ అయ్యాక నిరాశ మిగిలిందనుకోండి... దీనికి కారణం ఫేక్ రివ్యూలు, రేటింగ్లేనని అంటున్నారు నిపుణులు. నిర్ణయాలపై ప్రభావం..
- వర్చువల్గా సాగే ఆన్లైన్ వ్యాపారంలో వినియోగదారులు వస్తువుల్ని ప్రత్యక్షంగా చూసి, తెలుసుకొనే అవకాశం లేదు.
 - చాలామంది వెబ్సైట్లు, యాప్లలో ఆయా ఉత్పత్తుల గురించి పోస్టు చేస్తున్న రివ్యూలు, అభిప్రాయాలు చదివి... గతంలో వాటిని వాడిన వినియోగదారుల అనుభవాలపై ఆధారపడి కొనుగోలు చేస్తున్నారు.
 - ఎక్కువ మంది వినియోగదారులను ఈ రివ్యూలు, రేటింగ్లే ప్రభావితం చేస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి
 - దీంతో కొన్ని కంపెనీలు, ఈ-కామర్స్ సైట్లు తమ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసుకోవడానికి తప్పుడు రివ్యూలు రాయిస్తున్నాయి. స్టార్ రేటింగ్లు వచ్చేలా చేసుకుంటున్నాయి.
 
రివ్యూకు ఇంత...
- ఈ రివ్యూలు రాయడానికి, రేటింగ్ ఇవ్వడానికి కొంతమందిని నియమించుకుంటున్నారు.
 - ఒక్కో రివ్యూకు ఇంత మొత్తం అని కమీషన్గా ఇస్తున్నారు. రోజువారీ లక్ష్యాలు నిర్దేశించి వారితో పని చేయించుకుంటున్నారు.
 - ఇందుకోసం కొన్ని ప్రైవేటు ఫేస్బుక్ ఖాతాలు, వాట్సప్, టెలిగ్రామ్ సహా సామాజిక మాధ్యమాల్లో గ్రూపులు నడుపుతున్నారు.
 - వర్క్ ఫ్రం హోం, పార్ట్ టైం వర్క్ కావడంతో చాలామంది ఆయా గ్రూపుల్లో చేరుతున్నారు.
 - ఇటీవల విశాఖపట్నంలో హోటల్ రివ్యూల పేరుతో ఓ సైబర్ క్రైం బయటపడింది.
 
నివేదికలేం చెబుతున్నాయి...
- స్టార్ రేటింగులు, రివ్యూల్లో నకిలీవే ఎక్కువ ఉంటున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ తేల్చింది
 - ఓ సర్వే ప్రకారం.. ప్రపంచంలోని ప్రముఖ ఈ కామర్స్ సైట్లలో ఉన్నవాటిలో సుమారు 4 శాతం ఫేక్ రివ్యూలేనని తేలింది
 - యూరోపియన్ కమిషన్ వివరాల ప్రకారం బ్రిటన్లో పరిశీలించిన 223 ఈ-కామర్స్ సైట్లలో సగం కంటే ఎక్కువ వినియోగదారులకు నిజాయతీతో కూడిన సమాచారం లభించడం లేదు.
 - బ్రిటన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ రివ్యూలతో ప్రభావితమవుతూ.. అక్కడ ఏటా ఒక్కో కుటుంబం రూ.90 వేల మేర నష్టపోతోంది
 - మన దేశంలో కూడా ఇలాంటి ఉదంతాలు పెరుగుతున్నాయి. రివ్యూలపై ఆధారపడి కొనుగోలు చేసి మోసపోతున్నారు.
 - ఇలాంటి రివ్యూలు ప్రచురించడం అంటే 2019 వినియోగదారుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమే
 - వీటి నియంత్రణకు త్వరలో ఓ ప్రత్యేక వ్యవస్థ తేనున్నట్లు భారత వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది.
 
కట్టడికి సిద్ధం...
- ప్రజల్లో తమ విశ్వసనీయత పెంచుకోవడానికి కొన్ని ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు ఈ ఫేక్ రివ్యూల కట్టడికి సన్నద్ధమయ్యాయి
 - 2024లో సుమారు 27.50 కోట్లు, 2022లో 20 కోట్ల తప్పుడు రివ్యూల్ని అమెజాన్ తన వెబ్సైట్ నుంచి తొలగించింది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ, కొంతమంది నిపుణుల ద్వారా ఈ పనిచేస్తోంది
 - ప్రముఖ ట్రావెల్ వెబ్సైట్ ‘ట్రిప్ అడ్వయిజర్’ 2024లో 27 లక్షలు, 2023లో 20 లక్షల తప్పుడు రివ్యూల్ని ఫ్రాడ్ డిటెక్షన్ టెక్నాలజీ ద్వారా తొలగించినట్లు పేర్కొంది.
 
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆధారాలతో బయటపడిన అసలు రంగు
తామే నకిలీ మద్యం వ్యవహారాన్ని వెలికి తీయించామని.. మేం లేకపోతే కూటమి ప్రభుత్వం నీరుగార్చేది అంటూ ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం యూనిట్, సీసాలను స్వాధీనం చేసుకున్న సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడకు వచ్చి నానా యాగీ చేశారు. - 
                                    
                                        

అన్నపూర్ణ భర్తకు నైవేద్యాలకు కొదవా?
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని సీతారామాలయంలో శనివారం రాత్రి గౌరీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. - 
                                    
                                        

జాతీయ రహదారి 2 నెలలకే.. రెండు ముక్కలు!
కొత్తగా వేసిన రోడ్డుపై రాకపోకలు ప్రారంభించి రెండు నెలలైనా కాలేదు. అప్పుడే పగుళ్లిచ్చింది. దీంతో వివిధ సాకులతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. - 
                                    
                                        

రాయిచేప అందం.. ముళ్లకప్ప చందం
విశాఖలోని రుషికొండ బీచ్ సమీప సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు విభిన్న రకాల జీవులు చిక్కాయి. ఆకర్షణీయంగా పసుపు తోక కలిగిన రాయి చేపలతో పాటు ములుగుపాములు, ముళ్లకప్పలు లభ్యమయ్యాయి. - 
                                    
                                        

జోగి పాత్ర తేలడంతోనే అరెస్టు: ఎక్సైజ్ మంత్రి రవీంద్ర
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టయ్యారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. - 
                                    
                                        

సచిన్ను కలిసిన లోకేశ్ దంపతులు
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను కలిశారు. ‘‘ఇది ఫ్యాన్ బాయ్ క్షణం. ఈ రోజు లెజెండ్ను కలిసే అదృష్టం లభించింది. ఆయన వినయం, ఆప్యాయతల గురించి ఇప్పటి వరకూ వినడమే. - 
                                    
                                        

తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు
కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. - 
                                    
                                        

బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. - 
                                    
                                        

శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఆదివారం వైభవంగా జరిగింది. - 
                                    
                                        

అన్నవరంలో వైభవంగా తెప్పోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. - 
                                    
                                        

మొంథా బాధిత చేనేత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా
మొంథా తుపాను కారణంగా నష్టపోయిన చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. నీట మునిగిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారాన్ని అందించనున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత తెలిపారు. - 
                                    
                                        

తెలుగు భాషా, సాహిత్య సంపద పరిరక్షణ అవశ్యం
తెలుగు భాషా, సాహిత్య సంపదను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. - 
                                    
                                        

మహిళల విజయోత్సాహం వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లు
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఆదివారం జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు రాష్ట్రంలోని పలు క్రీడా మైదానాలు, కళాశాలల వద్ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో డిజిటల్, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. - 
                                    
                                        

‘చంద్రబాబూ ఖబడ్దార్.. లోకేశ్ జాగ్రత్త!’.. వేలు చూపిస్తూ జోగి రమేష్ హెచ్చరికలు
‘చంద్రబాబూ ఖబడ్దార్.. లోకేశ్ జాగ్రత్త’ అని వేలు చూపిస్తూ.. వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘చంద్రబాబు నీకూ కుటుంబముంది. - 
                                    
                                        

ముఖం కడుక్కోండి.. నిద్రమత్తు వీడండి
రాత్రివేళ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎక్కువగా ప్రమాదాలకు నిద్రమత్తే కారణమని గుర్తించి, వాహన డ్రైవర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. - 
                                    
                                        

నకిలీ మద్యం తయారు చేయించింది ఆయనే
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేషేనని ఎక్సైజ్, సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. - 
                                    
                                        

తొక్కిసలాట ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే జోగి అరెస్టు
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే మాజీ మంత్రి జోగి రమేష్ను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించిందని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. - 
                                    
                                        

తెలియదు.. సంబంధం లేదు.. గుర్తులేదు!
‘నాకు తెలియదు, సంబంధం లేదు. గుర్తులేదు..’ సిట్ విచారణలో ఎక్కువ ప్రశ్నలకు నకిలీ మద్యం కేసు నిందితుడు జోగి రమేష్ ఇచ్చిన సమాధానాలివే. - 
                                    
                                        

మాజీ మంత్రే సూత్రధారి: అనగాని సత్యప్రసాద్
రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ సూత్రధారి మాజీ మంత్రి జోగి రమేష్ అయితే.. పాత్రధారి అద్దేపల్లి జనార్దన్రావు ముఠా అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. - 
                                    
                                        

జనార్దన్రావుతో ‘జోగి’ సంబంధాలపై ఆధారాలు: సాదినేని యామినీ శర్మ
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్దన్రావుతో నేరుగా సంబంధాలు ఉన్నట్టు సిట్ పక్కా ఆధారాలు సేకరించిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ తెలిపారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 - 
                        
                            

జోగి రమేశ్ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్శాఖ పిటిషన్
 - 
                        
                            

ఎస్వీయూలో విద్యార్థినులపై ప్రొఫెసర్ వేధింపులు.. విద్యార్థి సంఘాల ఆందోళన
 - 
                        
                            

క్రికెట్ అందరి గేమ్: హర్మన్ ప్రీత్ కౌర్
 


