Vijayawada: ‘కాబోయే ఆర్మీ అధికారి కంటతడి పెట్టకూడదు’

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 06:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఏడుస్తున్న బాలుడిని ఓదార్చిన డీసీపీ సరిత

బాలుడిని తీసుకొని ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న డీసీపీ సరిత

విజయవాడ (గుణదల, పటమట), న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా కమిషనరేట్‌ అడ్మిన్‌ డీసీపీ సరిత విధులు నిర్వహిస్తూనే అమ్మతనాన్ని చాటారు. తుపాను నేపథ్యంలో బుధవారం ఆమె విజయవాడ గుణదలలోని కొండప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఆ క్రమంలో అస్తమానం ఫోన్‌ చూస్తున్నాడని కుటుంబసభ్యులు మందలించడంతో ఏడుస్తున్న పదేళ్ల బాలుడిని గమనించి, అతని దగ్గరకు వెళ్లి మాట్లాడారు. భవిష్యత్తులో ఏం అవుతావని అడగగా ఆర్మీ అధికారి అవుతానని బాలుడు చెప్పాడు. గొప్ప లక్ష్యమంటూ ప్రోత్సహించి.. కాబోయే ఆర్మీ అధికారి కంటతడి పెట్టకూడదన్నారు. తర్వాత పిల్లాడిని వెంటపెట్టుకుని కొండ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపించారు. అనంతరం తాను ఇంక ఫోన్‌ ఎక్కువ చూడకుండా.. లక్ష్యంపై దృష్టి పెడతానంటూ డీసీపీ సరితకు బాలుడు లేఖ రాశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు