AP News: పార్లమెంట్‌లో విశాఖ యువతి ప్రసంగం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అరుదైన అవకాశం దక్కించుకున్న గానప్రియ

విశాఖపట్నం(పెందుర్తి), న్యూస్‌టుడే : విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన మధుతూరి గానప్రియకు అరుదైన అవకాశం లభించింది. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా దిల్లీలోని పార్లమెంట్‌ భవనంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తన గళం వినిపించింది. ఏయూలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న గానప్రియ తండ్రి శ్రీను పెందుర్తిలో సెలూన్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. తల్లి భాగ్యలక్ష్మి స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్నారు. అన్ని అంశాలపై పట్టు సాధించిన గానప్రియ... పార్లమెంట్‌లో జరిగే కార్యక్రమానికి నిర్వహించిన ఎంపిక పరీక్షలో సత్తా చాటారు. దీంతో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకున్నారు. శుక్రవారం రాజ్యసభ సెంట్రల్‌ హాల్లో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ‘ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌’ గొప్పతనంపై ప్రసంగించి, అందరి ప్రశంసలు అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని