హైఅలర్ట్‌ ప్రకటించిన రైల్వే జీఎం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 28 Oct 2025 04:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియాతో చర్చిస్తున్న జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీవాత్సవ

విజయవాడ (రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: మొంథా తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాత్సవ విజయవాడ డివిజన్‌ అధికారులతో విజయవాడలో సమావేశం నిర్వహించారు. సోమవారం ఇక్కడ డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా అధ్యక్షతన అన్ని విభాగాల అధికారులతో చర్చించారు. ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రైలు పట్టాలు, వంతెనల వద్ద భద్రత పెంచాలని, ఆపరేటింగ్, విద్యుత్తు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లలో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాక్‌లు, బ్రిడ్జీలను నిరంతరం పెట్రోలింగ్‌ బృందాలు పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా చేరుకునేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. రైల్వేస్టేషన్‌ల్లో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ఆహార పదార్థాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు