ముంపు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 28 Oct 2025 04:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మంత్రులు అనగాని, అనిత

ఈనాడు, అమరావతి: మొంథా తుపాను నేపథ్యంలో సముద్ర తీరం వెంబడి ప్రభావిత గ్రామాల ప్రజల్ని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా బయటకొచ్చారని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి అనితతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు’’ అని సత్యప్రసాద్‌ తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 13 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయని...మరో మూడింటిని తెప్పిస్తున్నామని  అనిత వివరించారు. ‘‘తీర ప్రాంతాల ప్రజలు తుపాను పునరావాస కేంద్రాలకు వెళ్లి అధికార యంత్రాంగానికి సహకరించాలి. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ద్వారా అక్కడికి నిత్యావసర సరకులు సరఫరా చేస్తున్నాం. కలెక్టరు మొదలు వీఆర్వో వరకు అందరూ అప్రమత్తంగా ఉన్నారు’’ అని అనిత పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు