రీ సర్వేలో హద్దులు మార్చి భూ ఆక్రమణ

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 28 Oct 2025 05:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వైకాపా నేతలపై తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు 

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వంలో జరిగిన భూముల రీసర్వేలో హద్దులు మార్చేసిన వైకాపా నేతలు తన 1.28 ఎకరాల భూమిని వారి పొలంలో కలిపేసుకున్నారని కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కూరుకు చెందిన చెన్నరాయుడు వాపోయారు. న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలతో తరిలివచ్చిన బాధితుల నుంచి కుమ్మరి శాలివాహన సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పేరేపి ఈశ్వర్, ఏపీ నాగవంశ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రామనారాయణ వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. గ్రామంలోని 12 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన మల్లికార్జునరెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిని స్థానిక వీఆర్వో ఆయన కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన రామకోటేశ్వరరావు వాపోయారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు