తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చూడాలి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 28 Oct 2025 05:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మున్సిపల్‌ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశం 

ఈనాడు, అమరావతి: తుపాను నేపథ్యంలో తాగునీటి సరఫరాకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఇంజినీర్లను పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. కమిషనర్లతో మంత్రి సోమవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కాల్‌ సెంటర్లు 24 గంటలూ పనిచేసేలా చూడాలి. కంట్రోల్‌ రూంల ద్వారా ప్రజలకు నిరంతరం సమాచారం అందించాలి. రోడ్లపై చెట్లు కూలితే, వెంటనే తొలగించేలా యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లో నీరు  నిలవకుండా ఎప్పటికప్పుడు తొలగించాల’ని ఆదేశించారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్, పురపాలక శాఖ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని