ర్యాంప్‌ ప్రోగ్రాం పర్యవేక్షణకు కమిటీ

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 28 Oct 2025 05:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి: పరిశ్రమల శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక అమలు లక్ష్యం(ఎస్‌ఐపీ-ఐపీ) కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎస్‌ఎంఈ సీఈవో కమిటీ మెంబర్‌ కన్వీనర్‌గా.. వివిధ శాఖలకు చెందిన 7 మంది సభ్యులుగా.. జిల్లా నోడల్‌ అధికారులు ప్రత్యేక ఆహ్వానితులుగా కమిటీలో ఉంటారని పేర్కొంది. ర్యాంప్‌ జిల్లా నోడల్‌ అధికారులు కమిటీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. 

నిర్దేశించిన లక్ష్యాలు..

  • ర్యాంప్‌ ప్రోగ్రాంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిని నెలకోసారి కమిటీ సమీక్షించాలి. 
  • వ్యూహాత్మక పెట్టుబడి కార్యాచరణకు అనుగుణంగా సమావేశం ఉండాలి. 
  • భాగస్వామ్య పక్షాల మద్య సమన్వయం, ప్రోగ్రాం లక్ష్యాలను నిర్దేశిత వ్యవధిలో సాధించేలా పర్యవేక్షించాలి. 
  • పెట్టుబడుల పురోగతిపై ప్రతి నెలా చివరి మంగళవారం కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు కమిటీ నివేదిక పంపాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని