తితిదే కొనుగోళ్లలో అవినీతిపై ఏసీబీ దర్యాప్తు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 29 Oct 2025 06:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వైకుంఠ ద్వార దర్శనం పది రోజులు యథాతథం
తితిదే ధర్మకర్తల మండలి తీర్మానాలు

శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరిస్తున్న తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, చిత్రంలో ఈవో సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు

ఈనాడు డిజిటల్, తిరుపతి - తిరుమల, న్యూస్‌టుడే: తితిదేలోని మార్కెటింగ్‌ విభాగం ద్వారా చేపట్టిన సరకుల కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై ఏసీబీతో విచారణ జరిపించనున్నట్లు ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం బోర్డు సమావేశం   బీఆర్‌ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య  చౌదరి, సభ్యులు పాల్గొన్నారు. 103 అంశాలపై చర్చించారు. నవంబర్‌ 17 నుంచి 25 వరకు జరగనున్న శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ను ఆవిష్కరించారు. సమావేశం తీర్మానాలను ఛైర్మన్, ఈవో  విలేకరులకు వివరించారు.

  • తితిదే ప్రొక్యూర్‌మెంట్ విభాగంలో వైకాపా ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న కొందరు మార్కెటింగ్‌ కొనుగోలు కమిటీ ఉద్యోగులు భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించాం. ఉదాహరణకు రూ.350 విలువ చేసే శాలువాను రూ.1334లకు కొన్నట్లు రాశారు. ఇలా సుమారు రూ.50 కోట్ల అవినీతి జరిగింది. ఈ విభాగం సిబ్బందిపై ఏసీబీతో విచారణ జరిపిస్తాం.
  • రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో ఐదు వేల ఆలయాలు, భజన మందిరాల నిర్మాణం.
  • ఈ ఏడాది వైకుంఠద్వార దర్శనం యథావిధిగా పది రోజులపాటు కొనసాగించడం. దీనికి దర్శన టోకెన్ల జారీ ఆన్‌లైన్‌లోనా, ఆఫ్‌లైన్‌లోనా అన్నది పది రోజుల్లో వెల్లడి.
  • ఒంటిమిట్టలోని రాములవారి సన్నిధిలో 100 గదుల కాటేజీ నిర్మించేందుకు రూ.37 కోట్లు, పవిత్రవనం ఏర్పాటుకు మరో రూ.3 కోట్ల కేటాయింపు.
  • తితిదే పరిధిలోని అన్ని ఆలయాల్లో నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించాలన్న సీఎం ఆదేశాల అమలు.
  • తిరుమలలోని అద్దె గదుల ధరలను క్రమబద్ధీకరించడం.
  • తితిదే వేదిక్‌ యూనివర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి తొలగింపు.
  • వీటితో పాటు తితిదే పరిధిలోని ఆసుపత్రులు,  విద్యాసంస్థలు, గోశాల పనితీరు మెరుగుకు పాలనాపరమైన మార్పులపై తీర్మానాలు చేశారు. చెన్నై, కరీంనగర్‌లో తితిదే ఆలయాల నిర్మాణాలకు దాతల విరాళాలతో భూమి సేకరించాలని నిర్ణయించారు. కాణిపాకంలో రూ.20 కోట్లతో కాటేజీలు, కల్యాణ మండపాలు నిర్మించాలని తీర్మానించారు.
Tags :
Published : 29 Oct 2025 06:18 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని