Cyclone Montha: తుపాను బాధితులకు రోజుకు 10 వేల ఆహార పొట్లాలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 29 Oct 2025 06:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మంగళగిరి మండలం ఆత్మకూరులోని ‘అక్షయపాత్ర’ నుంచి ఆటోలో తరలిస్తున్న ఆహార పొట్లాలు

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఆత్మకూరు ‘అక్షయపాత్ర’ నుంచి రోజుకు 10 వేల ఆహార పొట్లాలు అందిస్తున్నట్లు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సెంట్రల్‌ రీజియన్‌ ఉపాధ్యక్షుడు విలాసదాస తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి అక్షయపాత్రలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు, హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్‌ ఫౌండేషన్, అన్నక్యాంటీన్‌ నెట్‌వర్క్‌ ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పంపిణీ ప్రారంభించినట్లు చెప్పారు. ఏలూరు, డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోనూ అన్నక్యాంటీన్ల ద్వారా ఆహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటితోపాటు నిత్యావసర వస్తువుల కిట్లను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

నిత్యావసర వస్తువుల కిట్లను చూపుతున్న విలాసదాస

Tags :
Published : 29 Oct 2025 06:39 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు