వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించండి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 29 Oct 2025 06:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడి ఆదేశం 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో బుధవారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారుల్ని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. పత్తి అమ్ముకోవాలనుకునే అన్నదాతలు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. తర్వాత కపాస్‌ కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని, సీసీఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి కొనుగోలు కేంద్రాల(జిన్నింగ్‌ మిల్లుల) ద్వారా అమ్ముకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. రైతులు నష్టపోకుండా రాష్ట్రవ్యాప్తంగా 30 కేంద్రాలను ఏర్పాటు చేసి... మద్దతు ధరకు అనుగుణంగా క్వింటాల్‌కు రూ.8,110 చొప్పున చెల్లించి పత్తిని సేకరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగైందని, 8 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామని వివరించారు. భారీవర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటల నష్ట అంచనా ప్రాథమిక నివేదికలను సేకరించామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని