సీనియర్‌ సైంటిఫిక్‌ అధికారిపై విచారణకు ప్రభుత్వం ఆదేశం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 29 Oct 2025 06:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి: ఔషధ నియంత్రణ విభాగం రాష్ట్ర లేబొరేటరీలో సీనియర్‌ సైంటిఫిక్‌ అధికారిగా పనిచేస్తున్న కె.యాదగిరిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ అధికారులుగా డ్రగ్‌ కంట్రోల్‌ ప్రధాన కార్యాలయ జేడీని, మరో సీనియర్‌ సైంటిఫిక్‌ అధికారిని నియమించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలను యాదగిరి ఎదుర్కొంటున్నారు. 2021 అక్టోబరు 20న ఒంగోలుకు చెందిన కె.శ్రీనివాస్, ఇతర ఫార్మసిస్టుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. పదోన్నతికి విచారణ అడ్డంకిగా మారుతోందని యాదగిరి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నిర్దేశిత సమయంలో విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కేసు విచారణ పూర్తిచేసి నివేదిక ఇచ్చేందుకు విచారణ అధికారులను నియమిస్తూ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు