ఈ-గవర్నెన్స్‌ సమర్థ అమలుకు సలహా మండలి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 29 Oct 2025 06:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ-గవర్నెన్స్‌ను సమర్థంగా అమలు చేసి, సాంకేతికంగా ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను అందిపుచ్చుకునేందుకు ‘ఈ-గవర్నెన్స్‌ సలహామండలి’ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సలహా మండలి ఛైర్మన్‌గా మంత్రి లోకేశ్‌ ఉంటారు. ఇందులో వివిధ ప్రముఖ కంపెనీల సీఎక్స్‌వోలు/ప్రముఖ ఐటీ కంపెనీలకు చెందిన హెడ్‌లు, బ్లాక్‌చైన్, క్లౌడ్‌ బేస్డ్, ఈ-గవర్నెన్స్‌ సొల్యూషన్స్‌ రూపొందించిన టెక్నాలజీ కంపెనీల హెడ్‌లు, కృత్రిమ మేధ, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ ప్రతినిధులు, గుర్తింపు పొందిన సంస్థల ప్రతినిధులు, డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ నిపుణులు, ప్రముఖ విద్యా సంస్థలు, ఐటీ శాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్, ఆర్టీజీఎస్, ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ, ఐటీ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులకు చోటు కల్పించారు. 

నిర్దేశిత లక్ష్యాలు

  • మెరుగైన పౌరసేవలు అందించేందుకు వీలుగా ఈ-గవర్నెన్స్‌ను తీర్చిదిద్దేందుకు రోడ్‌మ్యాప్‌ రూపొందించడం. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డిజిటల్‌ సేవలు అందిపుచ్చుకునేలా నిర్ణయాలు.
  • డేటా ఇంటిగ్రేషన్, రియల్‌టైం మానిటరింగ్‌ సిస్టమ్, పారదర్శక పాలన అందించేందుకు ఉన్న అవకాశాలు గుర్తించడం.
  • ఏఐ, బిగ్‌డేటా ఎనలిటిక్స్, బ్లాక్‌చైన్, ఐఓటీ, క్లౌడ్‌ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగానికి సూచనలు.
  • పౌరసేవలు, డిజిటల్‌ పేమెంట్‌ సొల్యూషన్లు, సంక్షేమ పథకాలను అందించే విధానాల్లో సాంకేతికత వినియోగం.. గుర్తింపు ఆధారిత యాక్సెస్‌ విధానాలపై సూచనలు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు