సంక్షిప్త వార్తలు (12)
దెబ్బతిన్న రహదారుల్నివెంటనే పునరుద్ధరించండి
అధికారులకు చంద్రబాబు ఆదేశం 
ఈనాడు, అమరావతి: మొంథా తుపానుతో దెబ్బతిన్న విద్యుత్తు సరఫరా, రహదారుల్ని తక్షణం పునరుద్ధరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీలను పటిష్ఠపరచాలని, పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ వేగంగా జరిగేలా చూడాలన్నారు. బుధవారం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు.. తాజా పరిస్థితిపై ఆర్టీజీఎస్ ద్వారా సమీక్షించారు. సహాయక చర్యల తీరు తెన్నులు, నష్ట తీవ్రతను గణాంకాలతో అధికారులు ఆయనకు వివరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు.
1న లండన్కు సీఎం చంద్రబాబు
ఈనాడు, అమరావతి: సీఎం చంద్రబాబు వచ్చే నెల 1న లండన్లో పర్యటించనున్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారుల్ని ఆహ్వానించేందుకు లండన్కు వెళుతున్నారు. పర్యటనలో ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమవుతారు. సీఐఐ ఆధ్వర్యంలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. 6న తిరిగి అమరావతి చేరుకుంటారు.
నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలి: ఏపీ రైతు సంఘం
ఈనాడు, అమరావతి: మొంథా తుపాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈశ్వరయ్య, కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ‘‘లక్ష హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనా వేసింది. డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, వైఎస్సార్ కడప, కాకినాడ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉంది. వరి, అరటి, కొబ్బరి పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలి’’ అని డిమాండ్ చేశారు.
జగన్ ఫోన్ నంబరుపై సీబీఐ పిటిషన్ కొట్టివేత
ఈనాడు, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో నిందితుడైన ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డి యూరప్ పర్యటనకు వెళ్లినప్పుడు సీబీఐకి సొంత ఫోన్ నంబరు ఇవ్వకపోవడంపై ఆ సంస్థ దాఖలు చేసిన మెమోను హైదరాబాద్ సీబీఐ కోర్టు బుధవారం కొట్టివేసింది. ఆ నంబరులో నిందితుడు అందుబాటులోకి రాకపోతే తగిన చర్యలు తీసుకోవచ్చంది. ఇక్కడ ఆయన పేరుతో నంబరు లేదన్నది సరైన కారణం కాదంటూ న్యాయమూర్తి పిటిషన్ను కొట్టివేశారు.
రూ.3 వేల చొప్పున సాయం
ఈనాడు, అమరావతి: తుపాను ప్రభావం దృష్ట్యా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వచ్చిన కుటుంబాలకు రూ.3 వేల చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నట్లయితే రూ.1,000 ఇవ్వాలని చెప్పింది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ మొత్తాన్ని అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వేడి, క్లోరినేటెడ్ నీటినే తాగండి
విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
ఈనాడు, అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వేడి చేసిన/క్లోరినేటెడ్ నీటిని మాత్రమే తాగాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ‘విరిగిన విద్యుత్తు స్తంభాలు, వదులుగా ఉండే తీగలు, తెగిన తీగలు, ఇతర పదునైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దెబ్బతిన్న/పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దు. దెబ్బతిన్న విద్యుత్తు పరికరాలు, వస్తువుల్ని వాడే ముందు వాటిని ఎలక్ట్రిషియన్తో తనిఖీ చేయించాలి’ అని పేర్కొన్నారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై మంత్రి గొట్టిపాటి సమీక్ష
ఈనాడు, అమరావతి: ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సరఫరా నిలిపేసిన ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తనిఖీ చేసి అవకాశం ఉన్న చోట్ల సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై డిస్కంల సీఎండీలు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించి మాట్లాడారు. ‘తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలి. సరఫరా పునరుద్ధరించే సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని పేర్కొన్నారు.
మంత్రి లోకేశ్ ఆరా
విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని మంత్రి లోకేశ్ సూచించారు. మంత్రి గొట్టిపాటికి ఫోన్ చేసి సమస్యలపై ఆరా తీశారు.
రాష్ట్ర పండుగగా సీపీ బ్రౌన్ జయంతి
ఈనాడు, అమరావతి: తెలుగు భాష ఉన్నతికి ఎనలేని కృషి చేసిన సీపీ బ్రౌన్ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఏటా నవంబర్ 10న బ్రౌన్ జయంతిని నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు రూ.10 కోట్ల మంజూరు
ఈనాడు, అమరావతి: పుట్టపర్తిలో వచ్చే నెల 23న నిర్వహించే సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరు కానున్న ఈ ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున తగు ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్ర పర్యాటక సంస్థ ఇందుకోసం పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సూక్ష్మసేద్యం అమలుకు ఆర్థిక వనరుల సమీకరణ
ఈనాడు, అమరావతి: సూక్ష్మసేద్యం అమల్లో భాగంగా ఆర్థిక వనరుల సమీకరణకు ఏపీ మైక్రో ఇరిగేషన్ సొసైటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనరల్ బాడీ ఛైర్మన్గా సీఎస్/వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్గా ఉద్యానశాఖ డైరెక్టర్ వ్యవహరిస్తారని పేర్కొంది.
చిక్కుకోలేదు.. చేజిక్కించుకునేందుకు వచ్చారు!

ఈ చిత్రం చూస్తుంటే ఏ ఊరి వారో వరద నీటిలో చిక్కుకుని, తాడు సాయంతో ఒడ్డుకు చేరుతున్నట్లు కనిపిస్తోంది కదూ! అయితే, ఈ విషయంలో మీరు పొరపాటుపడినట్లే. మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని గొడిపాలెం వద్ద పాలగెడ్డ జలాశయం రెండ్రోజులుగా పొంగి ప్రవహిస్తోంది. చేపల పెంపకానికి ఇక్కడి జలాశయం వద్ద గతంలో ఏర్పాటు చేసిన వలలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తొలగించారు. దీంతో జలాశయం వద్ద చేపలు పట్టేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారు తరలిరావడంతో బుధవారం ఇలా సందడి నెలకొంది.
న్యూస్టుడే, డెంకాడ
అతి పెద్ద చెరువు.. అలుగు పారింది

ఆసియాలోనే రెండో అతి పెద్దదైన ప్రకాశం జిల్లా కంభం చెరువు తుపాను ధాటికి బుధవారం నిండిపోయి అలుగు పారిందిలా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆధారాలతో బయటపడిన అసలు రంగు
తామే నకిలీ మద్యం వ్యవహారాన్ని వెలికి తీయించామని.. మేం లేకపోతే కూటమి ప్రభుత్వం నీరుగార్చేది అంటూ ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం యూనిట్, సీసాలను స్వాధీనం చేసుకున్న సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ అక్కడకు వచ్చి నానా యాగీ చేశారు. - 
                                    
                                        

అన్నపూర్ణ భర్తకు నైవేద్యాలకు కొదవా?
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని సీతారామాలయంలో శనివారం రాత్రి గౌరీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. - 
                                    
                                        

జాతీయ రహదారి 2 నెలలకే.. రెండు ముక్కలు!
కొత్తగా వేసిన రోడ్డుపై రాకపోకలు ప్రారంభించి రెండు నెలలైనా కాలేదు. అప్పుడే పగుళ్లిచ్చింది. దీంతో వివిధ సాకులతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. - 
                                    
                                        

రాయిచేప అందం.. ముళ్లకప్ప చందం
విశాఖలోని రుషికొండ బీచ్ సమీప సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు విభిన్న రకాల జీవులు చిక్కాయి. ఆకర్షణీయంగా పసుపు తోక కలిగిన రాయి చేపలతో పాటు ములుగుపాములు, ముళ్లకప్పలు లభ్యమయ్యాయి. - 
                                    
                                        

జోగి పాత్ర తేలడంతోనే అరెస్టు: ఎక్సైజ్ మంత్రి రవీంద్ర
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టయ్యారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. - 
                                    
                                        

సచిన్ను కలిసిన లోకేశ్ దంపతులు
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ను కలిశారు. ‘‘ఇది ఫ్యాన్ బాయ్ క్షణం. ఈ రోజు లెజెండ్ను కలిసే అదృష్టం లభించింది. ఆయన వినయం, ఆప్యాయతల గురించి ఇప్పటి వరకూ వినడమే. - 
                                    
                                        

తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు
కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. - 
                                    
                                        

బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. - 
                                    
                                        

శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఆదివారం వైభవంగా జరిగింది. - 
                                    
                                        

అన్నవరంలో వైభవంగా తెప్పోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. - 
                                    
                                        

మొంథా బాధిత చేనేత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా
మొంథా తుపాను కారణంగా నష్టపోయిన చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. నీట మునిగిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారాన్ని అందించనున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత తెలిపారు. - 
                                    
                                        

తెలుగు భాషా, సాహిత్య సంపద పరిరక్షణ అవశ్యం
తెలుగు భాషా, సాహిత్య సంపదను పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. - 
                                    
                                        

మహిళల విజయోత్సాహం వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లు
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఆదివారం జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు రాష్ట్రంలోని పలు క్రీడా మైదానాలు, కళాశాలల వద్ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో డిజిటల్, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. - 
                                    
                                        

‘చంద్రబాబూ ఖబడ్దార్.. లోకేశ్ జాగ్రత్త!’.. వేలు చూపిస్తూ జోగి రమేష్ హెచ్చరికలు
‘చంద్రబాబూ ఖబడ్దార్.. లోకేశ్ జాగ్రత్త’ అని వేలు చూపిస్తూ.. వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘చంద్రబాబు నీకూ కుటుంబముంది. - 
                                    
                                        

ముఖం కడుక్కోండి.. నిద్రమత్తు వీడండి
రాత్రివేళ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎక్కువగా ప్రమాదాలకు నిద్రమత్తే కారణమని గుర్తించి, వాహన డ్రైవర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. - 
                                    
                                        

నకిలీ మద్యం తయారు చేయించింది ఆయనే
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేషేనని ఎక్సైజ్, సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. - 
                                    
                                        

తొక్కిసలాట ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే జోగి అరెస్టు
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే మాజీ మంత్రి జోగి రమేష్ను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించిందని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. - 
                                    
                                        

తెలియదు.. సంబంధం లేదు.. గుర్తులేదు!
‘నాకు తెలియదు, సంబంధం లేదు. గుర్తులేదు..’ సిట్ విచారణలో ఎక్కువ ప్రశ్నలకు నకిలీ మద్యం కేసు నిందితుడు జోగి రమేష్ ఇచ్చిన సమాధానాలివే. - 
                                    
                                        

మాజీ మంత్రే సూత్రధారి: అనగాని సత్యప్రసాద్
రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ సూత్రధారి మాజీ మంత్రి జోగి రమేష్ అయితే.. పాత్రధారి అద్దేపల్లి జనార్దన్రావు ముఠా అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. - 
                                    
                                        

జనార్దన్రావుతో ‘జోగి’ సంబంధాలపై ఆధారాలు: సాదినేని యామినీ శర్మ
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న జనార్దన్రావుతో నేరుగా సంబంధాలు ఉన్నట్టు సిట్ పక్కా ఆధారాలు సేకరించిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ తెలిపారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అమ్మాయిల పట్టు.. బంతి చేయి దాటితే ఒట్టు..!
 - 
                        
                            

టాటా ట్రస్ట్స్ బోర్డు నుంచి తొలగింపు.. సవాల్ చేసిన మెహ్లీ మిస్త్రీ..!
 - 
                        
                            

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: పొన్నం
 - 
                        
                            

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
 - 
                        
                            

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబంలో అంతులేని విషాదం!
 - 
                        
                            

మ్యాచ్ బాల్ వేళ.. 1983లో గావస్కర్.. నేడు హర్మన్ప్రీత్
 


