రెడ్‌క్రాస్‌ భవన నిర్మాణానికి ‘మార్గదర్శి’ రూ.20 లక్షల విరాళం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 30 Oct 2025 05:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నిర్మాణ పనులను పరిశీలించిన చిత్తూరు కలెక్టర్‌

రెడ్‌క్రాస్‌ భవనం ముందు కలెక్టర్‌ సుమిత్‌కుమార్, సభ్యులు

చిత్తూరు (కొంగారెడ్డిపల్లి), న్యూస్‌టుడే: చిత్తూరు నగరంలోని రెడ్‌క్రాస్‌ రక్తనిధి కేంద్రం భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు. సంస్థ సేవలను విస్తృతం చేసేందుకు సహకారం అందిస్తానన్నారు. సప్తగిరి గ్రామీణ బ్యాంకు నుంచి రక్తనిధి కేంద్రానికి క్యాంపు వాహనం, లక్ష్మీనగర్‌ కాలనీలోని నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో శిక్షణకు నిధులు సమకూర్చుతామని చెప్పారు. రెండో అంతస్తు నిర్మాణానికి మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఎండీ శైలజాకిరణ్‌ సీఎస్‌ఆర్‌ నిధులు రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు రెడ్‌క్రాస్‌ కోశాధికారి తేజోమూర్తి తెలిపారు. సంస్థ జిల్లా అధ్యక్షుడు వి.రమేష్‌బాబు, ఉపాధ్యక్షుడు గోవర్ధనబాబు, వైద్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని