మొంథా తుపాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 05:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం మొంథా తుపాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించి, తీవ్రంగా నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌ చేశారు. నష్టాలు అంచనా వేయడానికి ప్రత్యేక బృందాలను వెంటనే రాష్ట్రానికి పంపాలని అన్నారు. అంచనా నివేదికలొచ్చేలోపు రాష్ట్రానికి తక్షణ సాయం కింద రూ.10 వేల కోట్లు ప్రధాని మోదీ ప్రకటించాలని గురువారం ఒక ప్రకటనలో షర్మిల విజ్ఞప్తి చేశారు. ‘ ప్రధాని మోదీ...ఆంధ్రప్రదేశ్‌పై సవతి ప్రేమ చూపిస్తున్నారు. ఆపద సమయంలో మొహం చాటేసి మరోసారి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకుపైగా పంటలు నీట మునిగాయి. ఖరీఫ్‌లో సాగైన పంటల్లో 30% పనికి రాకుండా పోయాయి. ఇది రూ.20 వేల కోట్లకుపైగానే జరిగిన అపార నష్టం. కేవలం 2.88 లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగినట్లు తక్కువ చేసి చూపడం రాష్ట్ర ప్రభుత్వానికి భావ్యం కాదు. సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం తీసుకురావాలి. తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి’ అని షర్మిల డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని