ఇది మానవ తప్పిద వైపరీత్యమే

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 05:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వైకాపా ముఖ్యనేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌

ఈనాడు, అమరావతి: ‘ఇది మానవ తప్పిద వైపరీత్యమే (మ్యాన్‌ మేడ్‌ కెలామిటీ). ఈ 16 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు రైతులు ఇలా నష్టపోవాల్సి వచ్చింది’ అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. ‘బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న 19 లక్షల మంది రైతులకే ఇప్పుడు పంటబీమా ఉంది. మిగిలిన 85 లక్షల మంది రైతుల 70 లక్షల ఎకరాలకు బీమా లేదు. గతేడాది ఖరీఫ్, రబీతో పాటు, ఈ ఏడాది కూడా ఏ సీజన్‌లోనూ ఏ పంటకూ ప్రభుత్వం బీమా ప్రీమియం కట్టలేదు. కాబట్టి ఇది కచ్చితంగా మ్యాన్‌ మేడ్‌ కెలామిటీ. ఇప్పుడు రైతులకు జరుగుతున్న నష్టం, వారి కష్టాలకు చంద్రబాబు బాధ్యుడు’ అని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘తుపాను పంటనష్టం అంచనాల్లో రైతులకు తోడుగా నిలబడాలి. నష్టం అంచనా పక్కాగా జరిగేలా చూడాలి. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదు. అంచనాల్లో ప్రభుత్వం ఎలాంటి తప్పు చేసినా గట్టిగా ప్రశ్నించాలి’ అని నాయకులకు జగన్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు