బస్సు ప్రమాద బాధితులకు రూ.40 లక్షలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 05:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

చెక్కు అందించిన వి.కావేరి ట్రావెల్స్‌ యాజమాన్యం

కలెక్టర్‌ డా.సిరికి రూ.40 లక్షల చెక్కు  అందజేస్తున్న కావేరి ట్రావెల్స్‌ యాజమాన్య ప్రతినిధులు. చిత్రంలో మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఎస్పీ, జేసీ

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలు నగర శివారులోని చెట్లమల్లాపురం వద్ద ఈ నెల 24న జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన బాధితులకు వి.కావేరి ట్రావెల్స్‌ యాజమాన్యం రూ.40 లక్షల ఆర్థికసాయం అందించింది. కర్నూలు కలెక్టరేట్‌లో వి.కావేరి ట్రావెల్స్‌ ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టి.జి భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జేసీ నూరుల్‌ ఖమర్‌ సమక్షంలో కలెక్టర్‌ డా.ఎ.సిరికి గురువారం ఈ చెక్కు అందజేశారు. బస్సుప్రమాదంలో మరణించిన 19 మందికి రూ.2 లక్షల చొప్పున రూ.38 లక్షలు, తీవ్రంగా గాయపడిన నలుగురికి రూ.50వేల చొప్పున రూ.2లక్షలు కలిపి మొత్తం రూ.40 లక్షల చెక్కు అందజేశారు. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందజేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు