వరదలపై అప్రమత్తంగా ఉండాలి: నిమ్మల

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 06:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు 

విజయవాడ (ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: వరదల నేపథ్యంలో కృష్ణా డెల్టా పరిధిలోని అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. కృష్ణా నదికి భారీ వరద వస్తున్న నేపథ్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని గురువారం పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు కృష్ణా వరదపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని వాగులు, కాల్వల కట్టల ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు