ఆందోళన వద్దు.. ప్రతి గింజా కొంటాం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 06:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

రైతులతో మంత్రి మనోహర్‌

రైతుతో మాట్లాడుతున్న మంత్రి నాదెండ్ల. చిత్రంలో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తదితరులు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తుపాను కారణంగా నష్టపోయిన రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజనూ కొంటామని, అధైర్యపడవద్దని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ రైతులకు భరోసా ఇచ్చారు. ఆయన గురువారం గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో పర్యటించి తుపాను కారణంగా వాలిపోయిన పంటలను పరిశీలించారు. నష్టం తీవ్రతపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  శుక్రవారం నుంచి పంట నష్టం నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి చెప్పారు. జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, సబ్‌ కలెక్టర్‌ సంజనా సింహ, వ్యవసాయశాఖ జేడీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని