రెండున్నర లక్షల హెక్టార్లలో పంట నష్టం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 06:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మంత్రి అచ్చెన్నాయుడు

పునాదిపాడులో నేలకొరిగిన వరిపైరును పరిశీలిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ తదితరులు 

కానూరు, కంకిపాడు గ్రామీణం, పెదపారుపూడి, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రెండున్నర లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని  మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం కృష్ణా జిల్లా తాడిగడప, కంకిపాడు మండలం పునాదిపాడులో నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. జగన్‌ వ్యాఖ్యలపై మంత్రి మాట్లాడుతూ.. ‘ఎన్నడూ రైతులను పట్టించుకోని జగన్‌  పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.వైకాపా హయాంలో 40 శాతం కూడా ఈ-క్రాప్‌ నమోదు చేయలేదు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం’ అని సవాల్‌ విసిరారు. తర్వాత పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో దెబ్బతిన్న వరి పంటను.. ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజాతో కలిసి పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు