నేను, లోకేశ్‌ వారంలో చెరో రోజు పార్టీ ఆఫీస్‌లో ఉంటాం

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 01 Nov 2025 05:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విలేకర్లతో ఇష్టాగోష్ఠిలో చంద్రబాబు 

ఈనాడు, అమరావతి: భవిష్యత్తులో ఎప్పుడూ తెదేపా ప్రతిపక్షంలో ఉండదని.. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతుందని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వారంలో ఒక రోజు తాను, మరో రోజు మంత్రి నారా లోకేశ్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. తాను గతంలో మూడు పర్యాయాలు సీఎంగా చేసిన పని విధానానికి ఇప్పటికీ చాలా తేడా ఉందన్నారు. ఇప్పుడు చేస్తున్నంత వేగంగా అప్పట్లో పనిచేయలేదని పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన కొద్దిసేపు విలేకర్లతో ముచ్చటించారు. మొంథా తుపాను నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి సహాయకచర్యల్ని ముమ్మరం చేయడం, నష్ట తీవ్రతను తగ్గించడం, విపత్తు నిర్వహణకు సమర్థంగా చర్యలు తీసుకోవడాన్ని విలేకర్లు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాలనలో వేగం పెరిగింది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్నీ గాడిన పెట్టాం. ఆటో పైలట్‌ విధానంలో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేసేలా చేశాం’ అని ఆయన వారితో అన్నారు.

ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమానికీ పార్టీ నేతలు ఓనర్‌షిప్‌ తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ‘పార్టీ కార్యాలయానికి వస్తే సొంతింటికి వచ్చిన భావన కలుగుతుంది. పార్టీలో ఏం జరుగుతుందో, క్షేత్ర స్థాయి పరిస్థితులేంటో తెలుస్తాయి. ఇక నుంచి వారంలో కచ్చితంగా ఒక రోజు పార్టీ ఆఫీసుకు వస్తాను. ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ఇంకా బాగా పనిచేయించేలా దృష్టి సారిస్తాను’ అని చంద్రబాబు తెలిపారు.  

Tags :
Published : 01 Nov 2025 05:24 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు