దార్శనికుడు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 01 Nov 2025 05:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ముఖ్యమంత్రి చంద్రబాబు

తెదేపా కేంద్ర కార్యాలయంలో వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు 

ఈనాడు, అమరావతి: భారత రాజ్యాంగంలో పౌరులకు ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు.. వాటిని కాపాడే బాధ్యత కూడా ఉందని ప్రతి పౌరుడికి బోధించిన దార్శనికుడు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎక్స్‌’ వేదికగా కొనియాడారు. క్యాంపు కార్యాలయం, మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలోనూ సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


ఐక్యతకు ప్రతీక పటేల్‌

ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: దేశ ఐక్యతకు ప్రతీక.. భారత ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ అని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కొనియాడారు. శుక్రవారం వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ‘ఎక్స్‌’ వేదికగా రాష్ట్రీయ ఏక్తా దివస్‌ శుభాకాంక్షలు తెలిపారు. 


దేశ ఐక్యతకు కృషి

తాడేపల్లి, న్యూస్‌టుడే: దేశ ఐక్యతకు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కృషి చేశారని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. పటేల్‌ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి ఉండవల్లి నివాసంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Tags :
Published : 01 Nov 2025 05:33 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు