నేటి నుంచి రాష్ట్రాల్లో సీఆర్‌ఎం బృందాల పర్యటన

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి: దేశవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కార్యక్రమాల అమలు, ఆరోగ్య వ్యవస్థల పనితీరు పరిశీలనకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కామన్‌ రివ్యూ మిషన్‌ (సీఆర్‌ఎం) బృందాలు శనివారం నుంచి రాష్ట్రాల్లో పర్యటించనున్నాయి. నవంబరు 1 నుంచి 7 వరకు, 17 నుంచి 21 వరకు రెండు దశల్లో ఈ పర్యటనలు సాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఈ బృందాలు సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తాయి. ప్రతి రాష్ట్రంలో ఎంపిక చేసిన రెండు జిల్లాల్లో నాలుగైదు రోజులపాటు సీఆర్‌ఎం ప్రతినిధులు పర్యటిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. అందులో భాగంగా కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ శాఖలోని పోషకాహార, అనుబంధ ఆరోగ్య సేవల ఉప కమిషనర్‌ డాక్టర్‌ జోయా అలీ రిజ్వీ నేతృత్వôలోని 12 మంది సభ్యులతో కూడిన బృందం ఈ నెల 3 నుంచి 7 వరకు రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని