దేశీయ ఉక్కు డిమాండ్‌లో 11-13% వృద్ధి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కేంద్ర సహాయమంత్రి శ్రీనివాసవర్మ

స్వీడన్‌ ఇంధనం, వ్యాపారం, పరిశ్రమలశాఖ సహాయమంత్రి సారామోడిగ్‌తో కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి శ్రీనివాసవర్మ 

ఈనాడు, దిల్లీ: ప్రపంచ మార్కెట్‌లో ఉక్కుకు డిమాండ్‌ మందగిస్తున్నా భారతదేశంలో పెద్దఎత్తున చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల కారణంగా ఇక్కడ ఉక్కు డిమాండ్‌ ఏటా 11-13 శాతం మేర పెరుగుతోందని కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆయన శుక్రవారం దిల్లీలో తన మంత్రిత్వశాఖ కార్యాలయంలో స్వీడన్‌ దేశ ఇంధనం, వ్యాపారం, పరిశ్రమలశాఖ సహాయమంత్రి సారామోడిగ్‌తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. 2030 నాటికి దేశీయంగా 300 మిలియన్‌ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్వీడన్‌ మెటలర్జికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, స్టీల్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ మిషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థల మధ్య పరిశోధన సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ఉక్కు ఉత్పత్తికి అవసరమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని తీర్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు