పీఎం కుసుమ్‌ టారిఫ్‌ ఆమోదం కోసం ఏపీఈఆర్‌సీకి ప్రతిపాదన

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈ నెల 26న బహిరంగ విచారణ

ఈనాడు-అమరావతి: పీఎం కుసుమ్‌ కింద ఫీడర్‌ స్థాయిలో ఏర్పాటు చేసే మినీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టులకు నిర్వహించిన టెండర్లలో గుత్తేదారుల నుంచి వచ్చిన టారిఫ్‌ ప్రతిపాదనలు అనుమతించాలని డిస్కంలు ఏపీఈఆర్‌సీకి పంపిన ప్రతిపాదనపై నవంబరు 26న కర్నూలులోని కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు ఏపీఈఆర్‌సీ తెలిపింది. ఆన్‌లైన్‌లో కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తామని.. సంబంధిత వ్యక్తులు/సంస్థలకు లింక్‌ వ్యక్తిగతంగా పంపుతామని పేర్కొంది. వ్యక్తులు, భాగస్వామ్యపక్షాలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలను ఏపీఈఆర్‌సీ కార్యాలయానికి నేరుగా కానీ, మెయిల్‌ commn-secy@aperc.in ద్వారా కానీ నవంబరు 10వ తేదీలోగా పంపాలని కమిషన్‌ పేర్కొంది. అదే సమాచారాన్ని మూడు డిస్కంలకూ పంపాలని పేర్కొంది. ప్రజల నుంచి అందిన అభ్యంతరాలపై పది రోజుల్లోగా డిస్కంలు వివరణ అందించాలని కమిషన్‌ ఆదేశించింది. పీఎం కుసుమ్‌ పథకం కింద 3,725 మెగావాట్ల మినీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానంలో డెవలపర్లను ఎంపిక చేసేందుకు ఇంధన శాఖ టెండర్లు పిలిచింది. అందులో ఎంపిక చేసిన డెవలపర్లతో సంప్రదింపుల తర్వాత టారిఫ్‌ను తేల్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు