ఎమ్మెల్యేల కబ్జాలు కనబడలేదా?

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 01 Nov 2025 06:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సీఎంను ప్రశ్నించిన సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

ఆర్కేనగర్‌ (అనంతపురం), న్యూస్‌టుడే: అన్ని విషయాలూ కంప్యూటర్‌లో చూసే మీకు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి, అక్రమాలు, కబ్జాలు కంప్యూటర్‌లో కనబడలేదా? తెదేపా నాయకులు చేస్తున్న దురాగతాలు లోకేశ్‌ రెడ్‌బుక్‌లో రాసుకోరా? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలే కబ్జాలకు పాల్పడుతుంటే ప్రజలు ఎవరికి  ఇబ్బందులు చెప్పుకోవాలని మండిపడ్డారు. ఆయన శుక్రవారం అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘గత 16 నెలలుగా 80 శాతంమంది ప్రజాప్రతినిధులు అక్రమార్జనలో తలమునకలై ఉన్నారు. సామాన్య ప్రజలనూ వదిలిపెట్టడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవుతోంది. దారితప్పిన నాయకులను కంట్రోల్‌ చేయాలి’ అని అన్నారు. తుఫాను కారణంగా పంట, ఆస్తి నష్టం అధికంగా జరిగిందని రామకృష్ణ పేర్కొన్నారు. టమాటా, ఉల్లి, మామిడి పంటల దిగుబడి మెరుగ్గా ఉన్నా గిట్టుబాటు ధరలు లేక రోడ్డున పారబోసే పరిస్థితి వచ్చిందని తెలిపారు.

Tags :
Published : 01 Nov 2025 05:50 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని