నాడు హైదరాబాద్‌ విలీనం కాకపోయి ఉంటే.. ఆ భూభాగం పాకిస్థాన్‌ పరిధిలో ఉండేది

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

ఏక్తా ర్యాలీలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్, ఎమ్మెల్యేలు మాధవి, నసీర్, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, మేయర్‌ రవీంద్ర

గుంటూరు(నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: స్వాతంత్య్రం వచ్చాక దేశం మొత్తాన్ని సమైక్యంగా ఉంచేందుకు 562 సంస్థానాలను విలీనం చేసిన ధీశాలి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం ఏక్తా దివస్‌ సందర్భంగా గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ‘మై భారత్‌ ఆర్గనైజేషన్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆనాడు రజాకార్లు, నిజాం సైన్యాన్ని వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నాలుగు రోజుల్లో ఓడించి హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారని, అలా జరగకపోయి ఉంటే ప్రస్తుత మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 2.15 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం పాకిస్థాన్‌ పరిధిలో ఉండేదన్నారు. దేశ సమగ్రత, సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. అంతకుముందు గుంటూరు కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ఏక్తా ర్యాలీని సత్యకుమార్‌ యాదవ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నసీర్, గళ్లా మాధవి, మేయర్‌ కోవెలమూడి రవీంద్ర, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు