వరద ముంచెత్తినా.. డ్రోన్‌ ఉంది అండగా..

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 06:00 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మద్దిరాలపాడు వద్ద నీట మునిగిన గ్రామాల్లో పర్యవేక్షణకు వెళ్తున్న డ్రోన్‌

మొంథా తుపాను తీరం దాటిన వేళ గుండ్లకమ్మ జలాశయం గేట్లు ఎత్తడంతో కొత్తపట్నం, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లోని 12 గ్రామాల్లో వరద నీరు భారీగా చేరింది. ఒంగోలు- చీరాల జాతీయ రహదారి మూసుకుపోయి ప్రజలు జలదిగంధంలోకి వెళ్లిపోయారు. అధికారులు అక్కడ అడుగుపెట్టలేని పరిస్థితి. అలాంటి సమయంలో గ్రామాల్లోని బాధితుల బాగోగులు తెలుసుకుని వారితో మాట్లాడి ధైర్యం చెప్పడానికి వీలుగా కర్నూలు ఐఐఐటీ రీసెర్చ్‌ విభాగం అధికారులు సరికొత్త డ్రోన్‌ను రూపొందించారు. వీడియో, ఫొటోల చిత్రీకరణే కాకుండా.. మైకు, కెమెరా, వీడియో కాలింగ్‌ తదితర సదుపాయాలున్న ఈ డ్రోన్‌ను శుక్రవారం నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలోకి పంపించారు. గ్రామస్థులకు మైక్‌లో అవసరమైన సూచనలు వినిపించడంతో పాటు వారితో లైవ్‌ వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ డ్రోన్‌ ద్వారా అవసరమైన వారికి మందులు, నిత్యావసరాలను అందించవచ్చని.. బాధితులతో లైవ్‌లో మాట్లాడే వీలుండడం వల్ల ఏదైనా అత్యవసరమైతే అంబులెన్స్‌లు, డాక్టర్లను పంపడానికి వీలుంటుందని ఐఐఐటీ ఫ్రొఫెసర్లు  కృష్ణానాయక్, నాగరాజు తెలిపారు. 

డ్రోన్‌ పనితీరును పరిశీలిస్తున్న ప్రొఫెసర్‌ కృష్ణానాయక్‌

ఈనాడు, ఒంగోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు