శ్వేతనాగుకు శస్త్రచికిత్స

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 06:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

గాయపడిన ఆరు అడుగుల శ్వేతనాగుకు చికిత్స చేసి దాని ప్రాణాన్ని నిలబెట్టిన ఘటన ఇది. విశాఖపట్నంలోని మల్కాపురంలో ఉన్న నేవీ క్యాంటీన్‌లో శుక్రవారం శ్వేతనాగు కనిపించడంతో నేవీ ఉద్యోగులు స్నేక్‌ క్యాచర్‌ నాగరాజుకు సమాచారం అందించారు. ఆయన వచ్చి పామును పట్టుకుని చూడగా పడగ భాగంలో గాయాలున్నాయి. వెంటనే హిందూస్థాన్‌ షిప్‌యార్డు కాలనీలోని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యాధికారి సీహెచ్‌ సునీల్‌కుమార్‌ పాముకు మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశారు. గాయానికి ఎనిమిది కుట్లు వేశారు. ఏదైనా వాహనం దానిపై ఎక్కి ఉండొచ్చని ఆయన తెలిపారు. గాయం తగ్గిన తర్వాత విడిచిపెడతామని పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, విశాఖపట్నం(మల్కాపురం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని